ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అనర్ఘరాఘవము (క్రీ.శ. 1700)
ఇది బిజ్జుల తిమ్మభూపాలకృతము. మురారి యనర్ఘరాఘవ నాటకమునకు ప్రబంధపరివర్తనము యథామాతృకము. ఇది ముద్రితమైనది.[1]
తెలుగులో జంటకవులు
తెలుగున జంటకవులనుగూర్చి పరిశోధించిన నీక్రిందివారు గన్పట్టుచున్నారు.
కాచవిభుడు-విఠలరాజు
వీరిరువురు రంగనాథరామాయణోత్తరకాండను ద్విపద గావించిరి.[2] వీరిరువురు సోదరులు. తెలుగున తొలిజంటకవులు వీరే. వీరు క్రీ. శ 1350 ప్రాంతమువారు.
నందిమల్లయ, ఘంట సింగయ్య
ప్రబోధచంద్రోదయ, వరాహపురాణాంధ్రీకరణకర్తలు.
తురగా రాజకవి - అయ్యంకి బాలసరస్వతి
వీరిరువురు కలిసి 'నాగర ఖండము' అను పద్యకావ్యము రచించిరి. కీ. శ. 1608 ప్రాంతమువారు.
కేసన-మల్లన కవులు.
వీరిరువురు దాక్షాయణీపరిణయము అను ప్రబంధము రచించినవారు. వీరిరువురు సోదరులు. బమ్మెర పోతనవంశీయులు. పోతనకు మునిమనుమలు. క్రీ. శ. 1850 ప్రాంతమువారు.