పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

పాంచాలీపరిణయము


శా.

వారయ్యిద్దఱుఁ గృష్ణఁ గూడి ఘటకృద్వాసాప్తులై యొక్కవృ
ద్ధారత్నంబునకు బ్రణామ మిడి రంతన్ భూసురశ్రేణికిన్
గౌరాంగుం డనుపం జతుర్ద్విజులు భిక్షం బెత్తి తే నేడ్గురున్
వారెల్లన్ భుజియించి కూర్కి రచటన్ దర్భాజినశ్రాంతులై.


క.

గోత్రామరులో క్షత్రియ, పుత్రులొ కావలయు నల్ల భూసురవేషుల్
ధాత్రీశ యితరజాతిచ, రిత్రులుగా రుక్తిరూపరేఖలు చూడన్.


సీ.

ఇప్పపూరాజనా లింతమెచ్చని మచ్చెకంటి కాబిచ్చాలవంటకంబు
పళ్ళెరం బిడులోనె పారుపత్యము చేయు కలికి కాండండఱి కడలు కుడుపు
చెంగల్వవిరిశయ్య నంగమొత్తుట కుల్కు బిబ్బోకరాశి కాదబ్బపాన్పు
మణులయొడ్డాణం బమర్పిన బరువెన్ను క న్నె కాయార్వుఱ కాళ్ళమోపు
బాపురే విధియం చేరుపడని కాపు, రము విలోకించి పాంచాలి ప్రాపు గాంచి
సంచలించెను మామకస్వాంతవీథి, చెలువభాగ్యంబు దేవరచిత్త మధిప.


శా.

అంచుంబల్కఁ బురోహితుం బిలిచి జాత్యాదుల్ విచారించి ర
మ్మంచుం బల్కిన ధర్మజుంగని యతం డాశ్చర్యచర్యల్ తదీ
యాంచద్రూప మెఱంగివచ్చి ద్రుపదక్ష్మాధ్యక్షుతోఁ జెప్పినన్
జంచద్ఘోటురథంబు లేర్పఱచి ధృష్టద్యుమ్నుఁ దోడ్తెమ్మనన్.


ఉ.

ఆతఁడు తీవ్రయత్నమున నచ్చటి కేగి పరేతరాట్తనూ
జాతుని గాంచి యానృపుఁ డొసంగు సపర్యల కుబ్బి పార్షద
క్ష్మాతలనేత రమ్మనిన చందముఁ జెప్పిన మాతృభామినీ
భ్రాతృపరీతుఁడై నగరిపజ్జకు వచ్చె రథాధిరూఢుఁడై.


మ.

అలఘుప్రాసశరాసధారుల యుగవ్యాయామబాహాయుగా
ర్గళులన్ లోహకనాటగాఢతరవక్షఃపీఠ వైశాల్యని
ర్మలరేఖాఘనులన్ ఘనాంగసుషమామార్తాండులం బాండవే
యులఁ బాంచాలుఁడు చూచి బాహుజులెయం చూహించె నేతేరఁగన్.


క.

చనుదెంచి యిటులు కుంతీతనయులు తనయొద్ద రాజతనుజోచితపీ
ఠిని నిశ్శంకత గూర్చుం, డిన వారికి ద్రుపదుఁ డిట్లనియెఁ బ్రియ మెసఁగన్.


శా.

అయ్యా మీరలు బాడబాగ్రణులొ బాహాజన్ములో ద్రౌపదిన్
దియ్యంబోడి వరింపఁగా వసుధ కేతేఁజూచు నాదిత్యులో
మీయూరుం గులగోత్రముల్ తెలియ కీమీనాక్షి నుద్వాహ మేఁ
జేయంజాలనటన్నఁ బాండుతనయజ్యేష్ఠుండు తా నిట్లనున్.