42
పల్నాటి చరిత్ర
వాగ్రణియై|
సీ॥ పెందోట పురవరమందు గాపురముండు
విశ్వకర్మాన్వయ విబుధవరులు |
నగ్రహారాది సమగ్రసుస్థ్వాదిక
ములును గల్గుటచేత గలిమిగాంచి |
వేదశాస్త్రాదిక విద్యల జదివి ది
వ్యజ్ఞాన సంపత్తినతిశయిల్లి
సకలయజ్ఞంబులు సరవితో గావించి
నిత్యాగ్నిహోత్రులై నెగడుచుండి
గీ॥ సుర పితామహునిని శతాధ్వరుని గురుని |
ధిక్కరించియు నిరతవితీర్ణ మహిమ |
ధైర్యమున వారిదాద్రుల దలకునటుల |
జేసి బ్రహ్మణ్యులైరి యీస్థిరను స్థిరత.
పల్నాటి వీరగాధ
12 వ శతాబ్దమున గురజాల రాజధానిగ పల్నాటిని అలుగురా జేలుచుండెను. అతనికి మైలమ్మయందు నలగామ రాజు, విజ్జల దేవియందు మలిదేవాదులు భూరమాదేవియందు నరసింగరాజు జన్మించిరి . అతనివద్ద బ్రహ్మనాయుడు మంత్రిగా నుండెను. అలుగురాజుపిమ్మట నలగామరాజు రాజయ్యెను. జిట్టగామాలపాటిలో నాయకురాలను పేర వ్యవహరింపబడు నాగమ్మయను వితంతువు లౌకిక వ్యవహారములందు ప్రజ్ఞగలిగి యుండెను. ఆమె రాజును 'మెప్పించి మంత్రిణి యయ్యెను. బ్రహ్మనాయనియం దసూయ కలిగి యతనికిని యతని యను చరులగు మలిదేవాదులకును నపకారములు చేయుచుండెను. అంతట బ్రహ్మనాయుడు రాజుననుజ్ఞ ముపొంది మలిదేవాదు లతో మాచర్లకుపోయి యా ప్రాంతమును మలిదేవాదుల పేర