పుట:పల్నాటి చరిత్ర.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

41

మందర నగములు |
       బొడ్డన బావులేపుట భేదనంబు
కమృతాభి ముఖ్యరత్నాకరములు |
        రవిసోమవీధులే రాజధానికి ప్రసిద్ధి
       గను నేబదియాఱు దేశములును ॥
       
గీ ॥ పరమమగునట్టి పెందోటపురవరమున |
    కధిపతి శిరోవతంసమై యలరె సకల
    కళల ధవళేశ్వరపురవిఖ్యాతు డైన
    గురుతరయశోధనుండు మార్కొండు ఘనుడు
    
సీ॥ శాలివాహనశక సంఖ్యాకములునగు
        పదియేనువందల పైయెనిమిది |
    వత్సరంబులలోన వసుధాస్తలంబున
        కుతుబుషాహీ నిజాంకుతలనాథు।
    ప్రాభవ వేళమార్కం డేయభూపతి
        ధవళేశ్వరాన్వయ భవుడునగుచు |
    సకలదిశావ్యాప్తి సాంద్రసుధా స్వచ్ఛ
        కీర్తి పరంపరాస్ఫూర్తినలరి
గీ॥ సురుచిరంబైన పెందోట పురినిలిచి |
    విశ్వకర్మాన్వయంబుధి వెలయజేసి
    సప్త సంతానములగని సాధువృత్తి
    ....వర్యులు భళియని స్తుతియొనర్ప |
    ధరనుబాలింపు చుండెను ధర్మనిరతి
    
కం॥ అతడు ప్రసిద్ధివహించెన్ |
    క్షితి వరగజపతులు గెలిచి చెలగి జయశ్రీ
    సతిజేకొనిన మహమ్మద్
    కుతుబ నిజాంచంద్రునకును కుడిభుజమగుచున్ ||
    
ఉ॥ ఎంతనియెన్నవచ్చు ధవళేశ్వరసోమయ మారుకండు ధీ
    మంతుని రాజ్యభారము, సమగ్రవిభూతియు సర్వమంత్రి సా
    మంతులయందలంబులె చమత్కృతి బారగరేకు దీర్చి న |
    ట్లంతటనిండుదద్గృహ సమావృతి చాల యలుకరించుచున్ ॥

కం. విశదముగ సల్పె నేకా |
    దశ మార్కొండయ్య లింగ ధామములు ని
    నిరంకుశ వృత్తిన్ శ్రీగిరి నా |
    శశితా రార్కముగ వీరశై