13
మన పూర్వకవులు సంస్కృతంలోని ఈ పురాణాలను తెలుగుపద్య గద్య ద్విపదలుగా మలచి పురాణాల ప్రచారం చేసినారు. అట్టి వారిలో కొందరు—
1. ఆదిత్యపురాణం : ఎలకూచి బాలసరస్వతి తమ్ముడు పిన్నయ ప్రభాకరుడు
2. కూర్మపురాణం : రాజలింగ కవి, తిమ్మరాజు లక్ష్మణరాయ కవి
3. గరుడపురాణం : పింగళి సూరన
4. దేవీభాగవతం : త్రిపురాన తమ్మయదొర, దాసు శ్రీరామకవి, ఆకొండి రామమూర్తి శాస్త్రి, తిరుపతి వేంకట కవులు
5. నారదీయం : పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి
6. నృసింహపురాణం : వేములవాడ భీమకవి, ఎఱ్ఱాప్రగడ, ప్రోలు గంటి చిన్నశౌరి, హరిభట్టు
7. పద్మ పురాణం : మడికి సింగన, కామినేని మల్లారెడ్డి, త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి, తెన్మఠం శ్రీరంగాచార్యులు, పినుపాటి చిదంబరశాస్త్రి
8. పురాణసారం : ఎఱ్ఱన (కొక్కోక రచయిత), గణపవరపు వేంకటకవి
9. భాగవతం : పోతన సింగన గంగయ నారయలు, మడికి సింగన, హరిభట్టు, రావూరి సంజీవరాయ కవి, తరిగొండ వెంకమ్మ, తంజనగరం తేవ ప్పెరుమాళ్ళయ్య, శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి
10. బ్రహ్మపురాణం : జనమంచి శేషాద్రిశర్మ