పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

పద్మపురాణము


వ.

ఇట్లు జలకణమిళితమందమారుతం బొలసినం జూచి దిలీపభూపతి
యచేచెరువ జలంబు గలుగనోపు నని యా చొప్పున వచ్చివచ్చి.

105


మ.

కనియె న్ముందట రాజచంద్రుఁడు లసత్కంజాతకింజల్కపుం
జనితాంతద్యుతి చారుతీరము నతిస్వచ్ఛాంబుసంపూరమున్
ఘనకల్లోలనినాదతోయ మనసంఘధ్వానవిస్తారమున్
జనితశ్రాంతిజనార్తిదూరము ఘనాసారమ్ముఁ గాసారమున్.

106


వ.

మఱియు సముద్రస్పర్ధియు ననేకపాదపప్రవృద్ధియు వికచకమల
కుముదకల్హరకువలయామోదమేదురంబును మకరందాస్వాద
మత్తమధుకరనికరంబును యథేష్టచలజ్జలచరనిర్భిన్నవీచితా
రాజివిరాజితంబును నానావిధవిహగనిరంతరకోలాహలసంకులం
బును నై సజ్జనహృదయంబునుం బోలె నతినిర్మలంబై ధూర్తు
చిత్తంబునుం బోలె నంతర్గ్రాహణక్రూరంబై దాతయుం బోలె
సర్వజనస్తవనీయజీవనోదకంబై మలయమారుతంబునుం బోలె
సంతాపహరంబై విలసిల్లు కొలనుఁ గాంచి జలదంబుఁ గనుం
గొన్నచాతకంబుచందంబున సంతుష్టాంతరంగుండై దిలీప
భూపాలుండు జలపానం బాచరించి విగతపథపరిశ్రాంతుండై
మధ్యాహ్నసమయానుష్ఠానంబు లనుష్ఠించి వివిధాస్త్రసంపన్న
సహాయసహితుండై వారలకు నిష్టకథలు వినిపించుచుఁ దత్తీరం
బున నున్న యవసరంబున.

107


చ.

ఘనమగు నెండతాఁకునకుఁ గాయము కంది [1]పరిభ్రమార్తుఁడై
జనపతి విశ్రమించె విలసన్మతిఁ జల్లని రాజు గాన న
య్యనఘుఁ దపింపఁజేయఁ దగదంచుఁ దొలంగినభంగి నర్కుఁ డొ
య్యనఁ జనియెన్ రథాంగకసమాఖ్యము లంగజుచేత బెగ్గిలన్.

108


ఆ.

అంత రాత్రియైన నవనీశుఁ డొకపెద్ద
మ్రాన నాదిపెట్టి పూనియుండె
శరశరాసనములు ధరియించి పదిలుఁడై
యచటి మృగగణంబు నరసికొనుచు.

109
  1. పరిశ్రమార్తుడై (తి)