పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

19


తే.

ఎద్ది సేయంగఁ బాపమై యేపు మిగులు
నెద్ది సేయంగఁ బుణ్యమై యెసఁగుచుండు
నట్టికర్తవ్య మెఱుఁగక యెట్టిభంగి
భూతకోట్లనుఁ బాలింతుఁ బూతచరిత!

87

పూర్వఖండ కథాసూచనము :

వ.

మఱియు బలాబలంబులును సారాసారంబులును గార్యాకార్యంబు
లును బుణ్యపాపంబులును నాదిగాఁ గల ప్రపంచంబంతయు
నాకుం దెలియ నానతిమ్మని యడిగినం గమలగర్భుండు కరుణించి
వసిష్ఠమహామునిం దలంచిన తత్క్షణంబ చనుదెంచి వినయవినతుం
డైన నమ్మునీంద్రునకు మనువుం జూపి యి మ్మహాత్ముం డడిగిన
యర్థంబంతయు సర్గాదియందు నాచేత నీకుఁ జెప్పంబడిన పద్మ
పురాణేతిహాసప్రపంచంబ కావున దాని సవిస్తరముగా నెఱింగింపు
మని నిర్దేశించిన వసిష్ఠమహాముని వలన నిప్పురాణంబు సర్వంబు
విని స్వాయంభువమనువు పుణ్యాత్ముండై సకలజగత్పరిపాల
నంబు చేసి పరమసిద్ధికిం జనియెఁ బదంపడి వైవస్వతమన్వంత
రంబున.

88


ఉ.

భూపకులప్రదీపుఁడు తపోదనసంస్తవనీయసత్యస
ల్లాపుఁడు ధర్మరక్షణకలాపుఁడు విగ్రహరాజభేదనో
ద్దీపితచండచాపుఁ డధరీకృతతాపుఁడు లోభమోహని
ర్లేపుఁ డవంధ్యకోపుఁడు దిలీపుఁడు నిర్జితపాపుఁ డున్నతిన్.

89


వ.

అమహ్మానుభావుం డిక్ష్వాకువంశసంభవుండు గావునఁ జతుస్స
ముద్రముద్రితం బగు వసుంధరావలయం బంతయుఁ దనశాస
నంబునం బ్రవర్తిల్ల నయోధ్యానగరంబు నిజరాజధానిగాఁ బురం
దరవైభవంబుతో రాజ్యంబు సేయుచుండి నిజకులక్రమాగతా
చార్యుండును బాదరాయణప్రపితామహుండును ద్రికాలజ్ఞుండును
భగవద్ధ్యానపరాయణుండును బరమజ్ఞానసుధాసముద్రుండును