పుట:పంచతంత్రి (భానుకవి).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డాశ విడిచి వచ్చి యమలజలాంతర
గతునిఁ గమఠవిభునిఁ గాంచె నపుడు.

98


క.

ఇది నాకు సంభవించెన్
బదివేలని మూఁటివెంట బారక యతఁ డ
మ్ముదికమఠము చిక్కమ్మునఁ
బదిలమ్ముగ నిలిపి చల్ది భక్షింపంగన్.

99


వ.

అయ్యవసరమ్మునఁ గాకహరిణమూషికంబులు ముగ్గురుం గూడి
యుద్యోగవంతులు బుద్ధిశాలు లగుటం జేసి తత్సవిూపంబునకుం జనుదెంచి
జలప్రాంతంబున నున్న కృతాంతనిభుడగు లుబ్ధకుని, నతనిచెంతం బట్టువడిన
నెచ్చెలిం గనుగొని శోకవ్యాకులితచిత్తులై పురపురంబొక్కుచు నలుదిక్కులు
సూచుచు మనము మువ్వురము నతనియండ వసియించి బ్రతికితి మింక
నితండు విడివడునుపాయం బెయ్యదియొకో యని తలంచుచున్నసమయంబు
నందు హిరణ్యకుం డిట్లనియె,—

100


క.

చెలికాఁడు రక్షకుఁడు ని
ర్మలచిత్తుఁడు కూర్మవిభుఁడు మనలను బాసెన్
దలపోయుఁ డతఁడు లుబ్ధకు
వలనం బెడవాయు నేర్పువఱలు మతమునన్.

101


క.

నిలువెల్ల ధర్మరూపము
తలఁపెల్లను దలఁపఁ బరహితం బమృతమ్ముల్
పలుకులు సువిచారత ని
ర్మలచిత్తుం డితని బాయరాదని మఱియున్.

102


క.

కాయంబు, లనిత్యంబు, ల
పాయంబులు వైభవములు ప్రాజ్ఞులకైనన్,—
పాయదు మృత్యువు, ధర్మో
పాయము దగుఁ బ్రజకు నూత్న భరతాచార్యా!

103


వ.

అని హిరణ్యకుండు నీతిమార్గం బుపదేశించి యితనికింగా మనము
శరీకంబులు విడిచిన నేమి యని నిశ్చయించిన వానిపలుకులు వినియు వినని