పుట:పంచతంత్రి (భానుకవి).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కరి బురదబొందఁ బడినను
గరియే వెడలించుఁగాక! కాకులతరమే
నిరుపమపుణ్యుం డీతని
నరయంగను నీక కాక యన్యులవశమే!

78


మ.

అనిన న్మంథరుఁ డట్ల కాకయని మీనాహారసంతుష్టచి
త్తునిఁ గావింపుచుఁ గాకమూషికసమేతుండై గుణగ్రాహ్యుఁడై
చనుమానంబున నుండగా నెదుట నాశ్చర్యంబుగాఁ దన్మహా
వనమధ్యంబున నాడు బంతికరణి న్వచ్చెన్ మృగం బుధ్ధతిన్.

79


వ.

అయ్యవసరంబున విహ్వలీకృతహృదయుండై మంథరుండు
కాకంబు నీక్షించుచుండంబంచి మూషికంబును నేనును నిచ్చటనే యుండు
దుము లేడి వచ్చినవిధంబు శీఘ్రంబున నెఱింగి రమ్మనిన, వల్లెయని యదియు
నుం జని యొక్కమహీరుహంబుపై వ్రాలి, యామృగంబున కిట్లనియె.

80


గీ.

ఎవ్వఁడవు నీవు బెదకంరంగ నేమి కార
ణంబు నీపూర్వకథయెల్ల నాకుఁ జెప్పు
మనిన వెరగంది మృగము తిర్యఙ్ముఖంబు
చేసి కాకంబుతోడుతఁ జెప్పఁదొడఁగె.

81


వ.

[ఏను చిత్రాంగుండనువాఁడ ము న్నొక్క]యటవీప్రదేశమ్మున
నాజననీజనకులు నివాసమ్ము చేసికొని మాయమ్మ నన్ను గర్భమ్ముతో
నుండి సుఖప్రసవంబు చేసిన దివసంబున.

82


గీ.

శబరుఁ డొక్కఁడు వేడుకఁ జపలుఁ డగుచు
నడవిలోపలఁ దిరుగాడి యమ్మ నన్ను
గన్నచోటికి నేతెంచి కాంక్షతోఁడ
నేయఁగడఁగిన నాతల్లి పోయె పారి.

83


క.

తడియారకుండ నేనును
దడబడుచుండంగ బోయ దగ్గఱి సనన్నున్
వడిఁబట్టి యెత్తుకొని తాఁ
గొడుకని భూమిపతి కమ్ముకొనియెన్ బ్రీతిన్!

84