పుట:పంచతంత్రి (భానుకవి).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ళ్ళకుఁ జాలుఁ జాప మౌర్వీ
ప్రకటములగు నరము లివుడు పారణ సేతున్.

63


గీ.

అనుచు లుబ్ధకమృగవరాహములఁ దత్ప్ర
దేశములఁ బెట్టి డాసి దురాశఁ జేసి
యల్లెఁ గొఱికినఁ దెగి హృదయమునఁ బడిన
నంతకునిఁ జేరె జంబుక మాక్షణమున.

64


క.

అని యివ్విధంబు దెలియన్
వినిపించి యతండు దేవవిప్రులకుం గా
క, నరులు తమకై కూర్చిన
ధనమంతయు నిలువదనుచుఁ దరుణికిఁ జెప్పెన్.

65


వ.

అని యివ్విధంబునఁ జూడాకర్ణునకు నాబృహస్వి యెఱింగించి
యమ్మూషికధనంబు, దేవభూదేవయోగ్యంబు గాదు. ద్రవ్యంబు కలిగియు
దురాశవలన భిక్షాన్నంబు భక్షించి యనవరతంబు నీ కపరాధం బొనరింపు
చున్నది నే యతిఁ గావున దీనియర్ధంబు నఖిలంబు గ్రహించితినని సంభ్రమంబున
లేచి మన్నిలయంబు జేరి.

66


ఉ.

కేల ఖనిత్ర మొప్పఁ బరికింపుచు మద్బిలభూమిఁ జేరి యా
భీలతఁ ద్రవ్వి నాధనము భీముఁడు గైకొనె నాఁటనుండి, దుః
ఖాలసమార్తినై, యిడుమ లందుచుఁ గుందుచు నివ్విధంబునన్
బేలక్రియన్ జరింపుదు నభేద్యగుణోన్నత! విభ్రమంబునన్.

67


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

68


క.

ధనముగలవాఁడె పండితుఁ,
డనఘుఁడు, ఘనకీర్తిమంతుఁ, డన్వయపూజ్యుం,
డనవరతదానశీలుఁడు,
విను మవనీతలమునందు విఠ్ఠయలక్ష్మా!

69


క.

పరదేశమె నిజదేశము
పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్
ధరణి నసాధ్యం బెయ్యది!
పరమార్థం బిదియె నూత్న భరతాచార్యా!

70