పుట:పంచతంత్రి (భానుకవి).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వెండియుఁ గలవని చెప్పిన
యండను, నవి తెలియఁజెప్పుమని యడుగుటయున్.

56


వ.

ఇట్లు చూడాకర్ణుం డడిగిన బృహస్వి యిట్లనియె, మున్ను వేదాగ్రేసరుం
డను బ్రాహ్మణుండు తనగృహంబున వసించియుండి యొక్కనాఁడు.

57


చ.

తనసతిఁ జూచి పర్వ మిటఁ దామరసానన! డాసె, విప్రభో
జన మొనరింపవే! యనుచు సామవచస్స్థితిఁ బల్కె, లేదు పొ
మ్మనిన, నమర్షదారుణతరాననుఁడై మును జంబుకంబు, గూ
ర్చిన పటలంబు, వాపి తుదిఁ జేరదె! కాలుపురంబు వింటిచేన్.

58


క.

అనిన నదెట్లని, విప్రుఁడు
తనునడిగినఁ బ్రాణసతికిఁ, దత్కథఁ జెప్పెన్
మును లుబ్ధకుఁ డొకపురమున
ననవరతము మాంసవిక్రయస్ధితి నుండున్.

59


వ.

ఉండి యొక్కనాఁ డతండు మృగయాభిరతి నరణ్యంబునకుఁ జని
యొక్కకణితిమృగమ్ము నేసి, దానిం గావడించుకొని చనుచుండ, నొక్క
వరాహం బెదిరినఁ దనమనంబున.

60


ఉ.

దైవముచేతఁ గూర్పఁబడె తథ్యము మాంసమటంచు నుర్విపై
జీవము లేని తన్మృగముఁ జేర్చి వరాహముఁ జంప, దానిచే
నావలఁ గూలెఁ గోశయుగళాంతర[1]గాహితఘోరదంష్ట్రుఁడై
యావిధ మెల్లఁ జూచి ముదమందుచు నొక్కసృగాల మత్తఱిన్.

61


వ.

అధికక్షుత్పరవశుండై యామిషాభిరతిం జనుదెంచి యిది దైవోప
పాదితంబని తలయూఁచి ధ్రువనామధేయుండగు జంబుకంబు తనమనంబున
నిట్లని వితర్కించె.

62


క.

ఒకదినము గడచు నీలు
బ్ధకమాంసము, కణితిమెగము దంష్ట్రియు రెణ్ణా

  1. భేదిత అని మూలము