Jump to content

పుట:పంచతంత్రి (భానుకవి).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వదినిఁ జేరుట కొకత్రోవఁ జేసి, యచ్చటచ్చట పచ్చికయు నిక్షుదండంబులు
నెరపి చుట్టును ముల్లడచి తమతమగృహమ్ములకుం జనినసమయమ్మున.

49


క.

గజపతి సతియును దానును
గజిబిజి లే నట్టియడవిఁ గాలూదకఁ వే
గఁ జనియు మేపులు మేయుచు
నిజముగ నోదంబులోన నెరిఁబడి [రంతన్].

50


క.

సతిపతులు గ్రంతఁబడి యా
తతమతి వెడలంగ లేక దైవమ! యనుచున్
మతిఁ గలఁగుచుండి, మూషిక
పతిఁ దలచుఁడు, నతఁడు వచ్చె బంధుయుతుండై.

51


గీ.

వచ్చి వంగిడిఁ బడియున్న వారణములఁ
గాంచి దుఃఖితుఁడై బలఁగంబుఁ జూచి
దరుల నొరలంగ ద్రవ్వి యీదంతియుగము
వెడలఁ దివియంగవలయు వివేకులార!

52


వ.

అని తనకులపతులకుం జెప్పి యసంఖ్యాతంబులగు నెలుకలంగూర్చి
యాక్షణంబున వంగిడిం బూడ్చి గజద్వయంబును వెడలించిన,—

53


గీ.

గుంత వెడలివచ్చి కుంజరయుగళమ్ము
మూషికమున కెలమి మ్రొక్కి మ్రొక్కి
నీవు గలుగఁబట్టి నేఁ బ్రతికితి నీకు
బిడ్డ పేరు పెట్టి పెంపుగందు.

54


వ.

అని కరిపతి మూషికపతినిఁ బెక్కువిధమ్ముల స్తుతియించి నేఁ
బోయివచ్చెద నన్ను మఱువకుమీ! యని చెప్పి యెలుకకులమ్ముచేత నా
మంత్రితుండై థేనరిగె. ఎలుకరాజును గజపతికిఁ దనకు వచ్చిన
పూర్వబద్ధసఖ్యమ్ముఁ దనకులంబువారలకుఁ జెప్పుచుఁ దనయింటి కరిగెనని
బృహస్వి చూడాకర్ణున కెఱిఁగించి వెండియు నిట్లనియె.

55


క.

శాండిలి యనఁదగు బ్రాహ్మణి
దండిగఁ దననాథువలనఁ దగ వినిన కథల్