పుట:పంచతంత్రి (భానుకవి).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కథలు నే వర్ణింపఁగాఁ బరభ్రాంతిచే
                    నవ్యచిత్తుఁడ వైతి వాగ్రహమున
నెలుకఁ గొట్టఁగఁబోతి చలశేముషీ! యన
                    నతఁ డిట్టులను, భిక్షమెల్లఁ దినిన,
దండించితిని నాఁగ దానికి బలఁగమ్ము
                    గలదొ! యొక్కటొ! చెప్పు ఘనుఁడ యొక్క


గీ.

యెలుకమాత్రంబునకు నింత యలుగనేల
యతిపతీ నీకు! కల దొక్కయమితకథయు,
మున్ను వారణమూషికములకు ననిన
నానతిమ్మని స్థలభిక్షుఁ డడుగుటయును.

46


వ.

మహాత్మా! తొల్లి గోదావరీతీరంబునఁ బ్రభంజనమ్మను పట్ట
ణంబు గల, దాపురిసమీపంబున శోణితయను నది ప్రవహించుచుండు,
యేటిచెంగటి నేలబొఱియలలో విఘ్నకుండను మూషికంబు నివా
సంబు జేసికొనియుండి, సమీపక్షేత్రంబుం బండిన ధాన్యం బాహారంబు
జేసికొని, యొక్కనాఁడు ప్రమాదవశంబున నేటిలోనంబడి ప్రవాహమ్ము
వెంబడి వఱదంబోవు నవసరమ్మున,—

47


క.

వారణపతి భీముండను
ధీరుఁడు జలకేళి సల్ప, దేవియు దానున్
ఆరూఢిగ నయ్యేటికిఁ
గోరిక నేతెంచి నీటఁ గ్రుంకుచునుండన్.

48


వ.

ఆవిఘ్నకుండును జలంబులం బడిపోవుచు శుండాలమిథు
నంబు గని, డగ్గఱంబోయి కరిరాజా! దిక్కులేక వఱదం బోవుచున్నవాఁడ
నన్ను వెడలింపుము నీకు నొకయవసరంబునకు వచ్చువాఁడ, నన్ను గొంచెం
బని చూడకుమని విన్నవించిన గజపతియును గృపాసముద్రుండు గావున
నాగజముఖాశ్వంబు దనకరంబునం బట్టి యేటిదరినిం బెట్టె, నదియును నతని
దీవించి నీకు నాపద వచ్చువేళఁ దన్నుం దలంపుమని చెప్పి తన్నిలయంబున
కరిగె. నంత గజేంద్రుండును జలకేళి సాలించి తనసతియుం దానును దత్సమీ
పారణ్యంబున నిష్టచర్యల వసియించియుండె,— అంత నేసుఁగు వేఁటకాండ్రు
తద్విపినంబు ప్రవేశించి యోదంబులు ద్రవ్వి చిల్లరత్రోవలు గట్టి కరినాథుఁడు