పుట:పంచతంత్రి (భానుకవి).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నఖిలవృత్తాంతదర్శియగు లఘుపతనకుండు నాహ్లాదపల్లవితహృదయుండై
చనుదెంచి హిరణ్యకున కిట్లనియె.

21


సీ.

చెలిమి నీతోడుతఁ జేసెదఁ గడు[మహ]
                    నీయపాత్రుండవు నీవు దలఁప
ననిన హిరణ్యకుం డపుడు నీ వెవ్వండ
                    వనినఁ గాకంబు నే ననియె, మూషి
కంబు, నీతో మైత్రి గావింపఁబోలునే!
                    యే నీకు నాహారమైనదాన
ననవుడు, నాకు ని న్నాహార మొనరింప
                    నాఁకలి దీరునే! యరసి చూడఁ,


గీ

బ్రతుకుదును నీవు జీవింపఁ బతగవిభుని
భాతి, నామాట విశ్వసింపంగ వచ్చు
వదరుఁ బలుకులు నీడోద్భవములయందుఁ
గలవె! యిందుకు నీచెలికాఁడె సాక్షి.

22


వ.

అట్లు గావున మద్భాషణమ్ములు భవద్భావంబునం గైతవమ్ము
లుగా దలంచెదవేని యెఱింగించెద వినుము.

23


క.

ఖలుదంభము సుజనులపైఁ
గొలుపదు తృణవహ్నిశిఖల, కూపారజలం
బులఁబోలె, మది దలంపఁగ
బలభిన్నిభభోగ! నూత్న భరతాచార్యా!

24


వ.

అనిన విని హిరణ్యకుం డాలఘుపతనకున కిట్లనియె.

25


క.

ధరఁ జపలుఁ డఖిలకార్యాం
తరములఁ దమకించి పొలియు, ధర్మపరుఁడు బం
ధురమతి వివేకయుతుఁడై
కరము సుఖస్థితిఁ దనర్చుఁ గరణిక లక్ష్మా!

26


మ.

అనినన్, వాయస మిష్టమైనది గజస్యా[శ్వాన్వ]యోత్తంస! పెం
పున నీతోఁడి సఖత్వమన్న, విని యా పుణ్యాత్ముఁడేఁ జెల్మి యె