పుట:పంచతంత్రి (భానుకవి).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శర్వు నానాకళాఖర్వు గజాసుర
                    గర్వాపహు సుపర్వసార్వభౌము


గీ.

భీము నప్పురిలింగమ్ముఁ బ్రియ మెలర్ప
సోమవారమ్ములను మనశ్శుద్ధి నుపవ
సించి, యవ్వారరామ పూజింపుచుండు
టెఱిఁగి యొకనాఁడు శుకరత్న మెగిరి చనియె.

340


వ.

ఇట్లు చని చరమసంధ్యాసమయమ్మున నబ్భీమలింగమ్ము గుడి
చొచ్చి యద్దేవునిఁ బూజించిన పత్రదూర్వాంకురసుమమ్ముల నడుమ నిల్చి
తననిజాంగమ్ము, స్వకార్యసిద్ధికొఱకు నర్చనగా సమర్పించెనో! యనఁ బచ్చ
వన్నియ మించి యం దణఁగియుండె నంత.


చ.

చెలులు ప్రయత్వపూర్వముగఁ జెంగలువల్ పొగడ ల్నవోత్పలం
బులు సురపొన్న లబ్జములు పొన్నలు నాదిగఁ బుష్పఖండముల్
ఫలములు పత్రముల్ పువులు పళ్ళెములంగొని యేఁగుదేఱ, వా
రలలన డాయవచ్చెఁ, ద్రిపురద్విషదంచితధామ మొప్పుగన్.

341


క.

ఆరాజబింబవదన పు
రారాతిం, బూజసేయునప్పుడు గని, గం
భీరస్వనమున నచ్చటి
కీరం బిట్లనియె దానికిం బ్రియ మెసఁగన్.

342


క.

ఓలలన! నిన్ను మెచ్చితి
నీలోకభ్రాంతి విడుపు నేఁ గొనిపోదున్
కైలాసశిఖరి కీక్షణ,
మేలా! యాలస్య మనిన, నిట్లని పలికెన్.

343


వ.

స్వామీ! మహాదేవ! దేవతారాధ్య! మదనభూతిలిప్తాంగ! తావ
కదయాపాంగవిశేషంబున మజ్జన్మమ్ము సఫలత్వమ్ము నొందె, బ్రహ్మేం
ద్రాదులకునైన, ననిర్వచనీయుండవైన నీవు వేశ్యయని నన్నుం జూడక
సాక్షాత్కారంబునం బిలిచి బుద్ధి ప్రసాదించితివి, నేఁ గృతార్థనైతి, నింక నే
నెయ్యది యాచరింపవలయు! నెఱింగింపుమనిన, నక్కపటకీరమ్ము మహే
శ్వరభ్రాంతియె తలంచి యిట్లనియె.

344