పుట:పంచతంత్రి (భానుకవి).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్రునివలనఁ బడసి చిలుకం
దినియెదనని వేశ్య మదిఁ బ్రతిజ్ఞ యొనర్చెన్.

336


క.

ఆరమణి నృత్యవిద్యా
పారీణత నొక్కనాఁడు పాకాసురసం
హారుని నూర్వశిక్రియఁ బెం
పారఁగ మెప్పించెఁ దజ్జనాధిపముఖ్యున్.

337


సీ.

మెప్పించి వెసను నమ్మేదినీరమణుని
                    రమణి ప్రార్థించి ప్రేమమున నడుగఁ
దద్భావగుప్తి కైతవము భావింపక
                    రత్నకాంచనపంజరమ్ముతోఁడ
నిచ్చిన, మచ్చర మెచ్చ నచ్చెలి నిజ
                    చేటిచేతికిఁ గూర సేయుమనుచు
నొసఁగిన, నది గరుద్విసరమ్ము మిసమిస
                    లొత్తుక తరుగంగఁ గత్తి కరుగఁ,


ఆ.

జిలుక దోఁగిదోఁగి చేరె జాలరిరంధ్ర
మునకు దానిపోకఁ గని భయమ్ము
వెనుప, నన్యపక్షిఁ గని వండిపెట్టిన
గుడిచి వేశ్య మిగులఁ గుతుక మొందె.

338


వ.

అంతఁ దత్సమయమ్మునం గీరమ్మును దృగ్గోచరమ్ము గాకుండ
జాలరిరంధ్రమ్మునం, దణంగి లజ్జావారి యుచ్ఛిష్టాహారమ్మువలన శరీర
పోషణం బాచరించుకొనుచు దనఱెక్కలు వచ్చునంతకు, నంద యుండె
నంత నవ్వార కాంతయు,—

339


సీ.

ఖండేందుశేఖరుఁ జండీశుఁ గుండలి
                    కుండలాలంకృతుఁ గొండయల్లు
మందాకినీధరు మందారమాలాంసుఁ
                    గందర్పదర్పఘ్ను నందివాహుఁ
గాలకూటాద్భుతనీలకంఠుఁ గృపాళు
                    ఫాలాక్షు నాభీలశూలహస్తు