పుట:పంచతంత్రి (భానుకవి).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

రుక్మతాటంకమణిగణరుచులఁ జిన్ని
నగవులును మోముతోఁ బొత్తు మిగుల నెరప,
లలన కైదండ గొని కడుచెలువ మొంద
ధారుణీపతి కలఁగన్న వారకాంత.

330


గీ.

వచ్చి జలజాయతాక్షి భూవరునిమ్రోల
నిలిచి నిజకుచరుచిఁబోలు నిమ్మపండ్లు
కౌతుకమ్మునఁ గానుకఁగా, నొసంగి
పలికె పుంస్కోకిలస్వరమ్ములు చెలంగ.

331


వ.

నరవరా! నిఖిలధర్మాధర్మవిదుండవగు నీ వెఱుంగని తగ వేది
యును లేదు. నాకు నిద్దురకు వేయిగద్దెంబులు జగమ్మున నున్నవిటు లొ
సంగుదురు. అది జగత్ప్రసిద్ధంబై పర్యవసించుఁ గావున, నేఁటిరాత్రి నన్ను కల
లోనం గలసినవాఁడవుగదా! యన, నమ్మహీకాంతుండు విని లజ్జించి, చింతా
క్రాంతుండై యిక్కాంతకు విత్తం బిచ్చినఁ గాక, వివాదమ్ము సంఘటిల్లునని
చిత్తమ్మునం దలఁచి యూరకుండ, నక్కొలువుకూటంబునఁ బంజరమధ్యంబు
నందున్న రాజకీరం బాకీరవాణిపలుకులు విని రాజుం జూచి యిట్లనియె.

332


ఉ.

చంచలచిత్త మేల నృపసత్తమ! విత్తము దర్పణమ్ముఁ దె
ప్పించుము పెద్దవారిఁ బిలిపింపుము సత్వర మన్న, నట్ల కా
వించినఁ, దత్సభాజనులవీనులపండు వొనర్పఁ జిల్క భా
షించి కలధ్వనిం దగవు సెప్పెను రాజుకు వారకాంతకున్.

333


చ.

కల దను నొందెనంచు, మహికాంతుని నిద్దుర పైఁడి వేఁడ, వా
కలలన, వచ్చె మీరు ముకురప్రతిబింబితవిత్తరాశి యి
చ్చెలువకుఁ జూపుడన్న, నటుచేసిన, నాననబోణి, సిగ్గునన్
వెలువడె రాజమందిరముఁ, వేమరు బల్లవులెల్ల నవ్వఁగన్.

334


వ.

అప్పు డాసభాజనమ్ము తదుపాయమ్ము నకు విస్మయంబందె.
నరేంద్రుండును దనకళంకమ్ము వాపెనని, తద్దయు రాజకీరంబుఁ బోషింపు
చుండె, నంత.

335


క.

తను నధికసభామధ్యం
బునఁ బ్రజ్ఞాప్రౌఢి లజ్జవోఁజూచె, నరేం