పుట:పంచతంత్రి (భానుకవి).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహాత్ముఁడని నిశ్చయించి యాతని యినుపముద్దలు తెచ్చియిచ్చె, నా
కోమటియు నవ్వుచుఁ గుమారుఁ దెచ్చి సఖున కొప్పించె, నట్లు భవజ్జీవంబు
నకై మృగేంద్రవృషభేంద్రులకుఁ గైతవవిరోధంబు గల్పించితివి నీసహ
వాసం బధికప్రయాసంబని చెప్పి దమనకుతో వెండియు నిట్లనియె.

317


క.

వేయు, పది, యేను, చేతులు
వాయుదు, రేనుఁగుకు హరికిఁ బందికిఁ, గపటో
పాయులకునైన సుజనులు
వాయుదు రెడకల్గ, నూత్న భరతాచార్యా!

318


క.

అని కరటకుఁ డీచందం
బున నిందింపంగ, సిగ్గుబొందిన డెందం
బునఁ గుందుచు దమనకు డుం
డెనంత, హరి గోవిభుని వడిం బొలియించెన్.

319


వ.

అప్పుడు.

320


మ.

కర మాశ్చర్యముగా, హిరణ్యకశిపున్ గైవల్యమున్ జేర్చి, బం
ధురరోషానలహేతిరేఖ, నమృతాంధుల్ భీతినొందన్ భయం
కరుఁడై యున్న నృసింహుచందమున నక్కంఠీరవేంద్రుండు గో
వరుఁ జెండాడి మృగౌఘముల్ గలఁగ గర్వస్ఫూర్తియై నున్నచోన్.

321


వ.

ఇట్లు విజృంభించి మృగపతి శోభిల్లుచుండఁ గరటకదమనకు లతని
సమ్ముఖంబున కరిగి యతనిపాదమ్ములపై వ్రాలిన నతండు శోకవ్యాకుల
చిత్తుండై నిట్టూర్పులు నిగుడించుచు వారలతో నిట్లనియె.

322


గీ.

మొదలు రక్షించి వృషభేంద్రుఁ గదనభూమి
నకట చంపితి వృ......చి
కాన నఱకుట జగదయుక్తమ్ము గాదె!
గర్వవశమునఁ గలుషమ్ము గట్టుకొంటి.

323


ఉ.

ప్రాణసమానుఁడైన వృషభప్రభుఁ, గోపయుతుండనై, రణ
క్షోణి నణంచియున్న ననుఁ జూచి, మనంబున నమ్మునే! మృగ
శ్రేణి, మృగేంద్రరాజ్యము రుచించునె! నామదికిం దలంపఁ గ
ల్యాణగుణమ్ము బాసి దురితాత్ముఁడ నైతిని నేను నిత్తఱిన్.

324