పుట:పంచతంత్రి (భానుకవి).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

విని దమనకుం డేతత్కథ యెఱింగింపుమనినఁ గరటకుం డిట్లనియె.
ము న్నొక్కపట్టణంబున నతిక్షీణవిభవుండగు వణిక్కుమారుండు గలఁడు.
అతండు లేమి చేతం గ్రిందువడి పత్తిగింజలు చిళ్ళగింజలు జీడివిత్తులు చీపురు
కట్టలు విస్తరాకులు ఉప్పు గుగ్గిళ్ళు గానుగపిండి మజ్జిగ కూరలు కట్టెలు
మొదలుగాగల క్షుద్రద్రవ్యమ్ము లమ్ముకొని తత్పదార్థంబున వేలపర్యం
తంబులు, ఇనుపముద్దలు గొని యవి స్వకీయద్రవ్యమ్ము లని తనసఖు
నొద్ద డాఁచి ద్రవ్యం బార్జించుకొఱకు నన్యదేశంబునకుం జని యందు బహు
వ్యాపారమ్ములం దిరిగిన, మందభాగ్యవశత్వంబున నేమియు నబ్బక రిక్త
హస్తుండై తిరిగి తననిలయంబు జేరి.

313


క.

అతిరయమున లోహసహ
ప్రతతులు నా కొసఁగుమనుచు సఖు నడిగిన, ను
ద్ధత లుబ్ధమానసుండై
యతఁ డా, ఖుశేణి మ్రింగెనని పలుకుటయున్.

314


వ.

విని యిది మహాద్భుతంబని పెద్దయుం బ్రొద్దు చింతించి యతం
డొక్కయుపాయమ్మునం గాని తనయినుపముద్దలు మళ్ళవని నిశ్చ
యించి యాసఖునితో నిట్లను, నే నభ్యంగనమ్ము చేసుక బహుదినంబు
లాయెను తటాకతీరంబున నుష్ణజలమ్ములు నిర్మించుక తీర్థం బాడెద, నచటికి
నీసుతుచేతఁ దైలం బంపుమని చెప్పిన, నతం డట్ల చేసిన, బాలవణిక్కులు
తటాకంబు చేరి వణిక్పుంగవుం డభ్యంగనం బాచరించి తీర్థం బాడి తిరిగి
వచ్చునప్పుడు సఖుసతు నొక్కగొందిని దాఁచి యొక్కండును సఖుగృహం
బున కేతెంచినఁ, దత్సఖుండు దురపిల్లుచుఁ గోమటి నీక్షించి,—

315


ఉ.

బాలకుఁ డెందుఁ బోయెనని పల్కిన, నాతఁడు డేగ బల్విడిన్
దైలసమేతుగా నుడుపథమ్మునకుం గొనిపోయెనన్న, శో
కాలయమూర్తులై భువనమం దిది చిత్ర మటన్న, వారలన్
లాలితదంభజృంభితమనమ్మునఁ గౌతుక మంది యిట్లనున్.

316


వ.

మూషికమ్ము లస్మదీయలోహసహస్రమ్ముల భక్షించినట్ల, నీ
కొమరుని డేగయు దివమ్మునకుం గొనిపోయె, నేమి చేయవచ్చు! నిద్దఱకును
దుఃఖమ్ము సరియ, నాకుఁ బదార్థమ్ము పోయె,నీకు నీసుతుండు పోయె, నిందుకు
వడలం బని లేదు; ఊరకుండుమని చెప్పినఁ, దద్భావగుప్తం బెఱింగి సఖుండు