పుట:పంచతంత్రి (భానుకవి).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్వి పడగఁ జెప్పి వాని యవివేకము మాన్పి హితం బొనర్చినన్
విపులయశమ్ము నొందు గుణవిశ్రుత! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

277


చ.

గురు వెలయన్ బ్రధాని, నృపకుంజరు నర్భకురీతి, నీతిశా
స్త్రరుచిరచిత్తుఁ జేసి, పరరాష్ట్రసభాజనమెల్ల మెచ్చఁ బెం
పరుదుగ నుండెనేనిఁ, దను నత్యధికంబగు నూత్నభోగముల్
సిరియును గీర్తి బొందు నిది సిద్ధము విఠ్ఠయ లక్ష్మధీమణీ!

278


ఉ.

ఆరసిచూడ రాజు సుకృతాంచితుఁడైవఁ, దదీయసేవకుం
గ్రూరపుమంత్రి డాసిన నకుంఠమతిం బ్రజ తల్లడింపుచున్
జేరదు, నక్రమున్న సరసింబలె, నుగ్రఫణీంద్రమున్న ధా
త్రీరుహ మట్లు వానిఁ, గులదీపక! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

279


వ.

అని పల్కి ధర్మమార్గమ్ము కపటాంధతమసమ్మున నెఱుంగఁ
బడదు. భవజ్జఠరార్థంబు మృగేంద్రున కహితం బాచరించితివి. పాలును నీరు
నుంబోలె నతిలియ్యంబైయున్న వృషభపంచాననులకు, నన్యోన్యవైరమ్ముఁ
జేసితి విస్సిరో! యిది యన్యాయంబు, మిథ్యావాక్యమ్ము లాదేశించినవాని
జగద్ద్రోహి యన వినవే! అవమతికి బుద్ధి సెప్పుట యకర్తవ్యం బనక యెఱిం
గించెనేని, యతండు వలిముఖునిచేత సూచీముఖుండను పతత్రిపతియునుం
బోలెఁ బొలియుననిన విని దమనకుం డాకథ యెఱింగింపు మనినఁ గరటకుం
డిట్లనియె.

280


చ.

జలధి సరిత్సుధాకిరణశైత్యసమేధితమైన, యాహిమా
చలమున ముంచి పూని వెదచల్లుచు వచ్చినయట్ల, లోకమున్
గలగొన మంచు ముంచి చలికాలము మున్ను దనర్చె, నెంతయున్
జలరుహబాంధవుండు గడుచంచలతన్ శిఖిమూల కేఁగఁగన్.

281


క.

లలనాకుచదుర్గంబులు
గలుగఁగ, హరిహరపయోజగర్భులు జనులున్
దలడుఁప సుఖించిరి గా కీ
చలి పగఱకుఁ దలఁగ నొండు శరణము గలదే!

282


వ.

తత్కాలమ్మున, —

283