పుట:పంచతంత్రి (భానుకవి).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

లాంగూలం బల్లార్చి క
నుంగవ ద్రిప్పుచును నోర నురువులు గ్రమ్మన్
మ్రోఁగుచు నుండిన నెఱుఁగుము
సింగము జగడమ్మునకును జేరె నటంచున్.

271


క.

అని చెప్పి దమనకుఁడు వెసఁ
జని కరటకుతోఁడ నపుడు సర్వము దెలియన్
వినుపించిన నాతఁడు తనుఁ
గనుగొని నిందించి పలికెఁ గలఁగినమతితోన్.

272


క.

హితమంత్రి వయ్యు నక్కట
పతికిని వృషభేంద్రునకును బగపుట్టఁగ నీ
గతిఁ దిండి కొనర్చితి, సం
గతి మాలినకార్య మధికకపటాకృతివై.

273


వ.

అని పలికెఁ దదనంతరంబ.

274


ఉ.

నీలబలాహకవ్రజము, నింగిపయిం గనుపట్టె మందవా
తూలము లెల్లడం బరగెఁ, దోఁచె మెఱుంగులు దిక్కులందు, ధా
రాళమహోగ్రవర్షము ధరావలయంబునఁ గప్పె, భోగిభు
గ్జాలము నృత్యము ల్దనరె శైలములన్ దొలివానకారునన్.

275


వ.

తత్సమయంబున వృషభేంద్రుడును గాలచోదితుండై ధారా
వర్షమ్మునకు సహింపలేక విషాణమ్ములు వంచుకొని మృగేంద్రుం జేరిన
నతండును దర్పోద్ధతుండై లాంగూలం బల్లార్చి వివృతవదనగహ్వరుండై
మహానాదంబు గావించి దమనకుండు సెప్పినవిధంబున నితండు నాతో సంగ
రమ్మునకు వచ్చినవాఁడు మేలెఱుంగఁజాలక కయ్యంబు నకు వచ్చిన నీ
గోద నిప్పుడు పట్టి చంపెదనని సమరంబునకుఁ దలపడి భీమహిడింబులట్ల
పోరం దొడంగిన నఖిలమృగమ్ములు గలంగె నప్పుడు కరటకుండు దమన
కుం జూచి దుర్బుద్ధీ! నీకతమ్మున నీ యిరువురకు విరోధంబు వాటిల్లెనని
యిట్లనియె.

276


చ.

నృపతి మదోద్ధతుండయిన నేర్పున మంత్రివరుండు రాచకా
ర్యపుసరవుల్ ప్రజావితతి నంటని యాపద మంచివేళ జె