పుట:పంచతంత్రి (భానుకవి).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అది యెట్టిదనఁ, గమలాకరం బొక్కటి
                    జలసంచయంబునఁ జెలగుచుండుఁ
దగినవేడుక జయంబుగ మీసములు మూడు
                    వసీయించి యుండంగ వాంఛతోఁడ
జాలరు లచటికిఁ జనుదెంతురని యనా
                    గతవిధాతనువాఁడు మతివివేక
మున నెందుకైనను జనవలెనన, విని
                    తాత్కాలికప్రజ్ఞ తగునటంచు
నుత్పన్నమతి చెప్పె నొకకథ మును గొల్ల
                    వనజాక్షి తలవరితనయుఁ గూడి


గీ.

వానితండ్రి కోరివచ్చిన నెఱిఁగి త
త్తనుజు గాదెలోన దాఁచి యతనిఁ
గామతంత్రకేళిఁ గరఁగింప బాంధవుఁ
డరుగుదేరఁ జూచి యంత లేచి.

259


చ.

అలిఁగి సుతుండు మీభవనమందులకున్ జనుదెంచెనంచు నీ
తలవరి వచ్చె లేదనినఁ, దా మది నమ్మఁడు సూడుమంచుఁ దొ
య్యలి విభుఁ గూడి జారు నపు డంపి నయంబున డాసి గాదెలో
పల నణఁగున్న తత్సుతుని బైకొను వేడుకఁ, దీసి యిట్లనున్.

260


వ.

మీజనకుం డెఱుంగకుండం జనుమని కరుణార్ద్రచిత్తయుం
బోలె మందిరమ్ము వెడలననిపి యాత్మదోషంబు దెలియంబడకుండ నక్కు
లట నిజవల్లభు నిష్టోపభోగమ్ములం దేలించె నట్లు గావున తాత్కాలిక
మతియె కారణంబని చెప్పిన, నంగీకరింపక యనాగతవిధాత యనువాఁ డన్య
సరోవరంబున కరిగె నంత నొక్కనాఁడు.

261


క.

జాలరులు వచ్చి యొక్కట
జాలమ్ములు విప్పి కొలనుజలములపై నా
భీలత నెగవఁగ వైచిన
నాలో, నుత్పన్న మతిభయస్వాంతుండై.

262


క.

మృతి నొందినట్లు దెలిసిన
యతనిం బొడగాంచి వార లావల నిడి, యం