పుట:పంచతంత్రి (భానుకవి).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వోలె జెడు నన మదికి నద్భుతము వొడమ
వనిత తద్విధ మేరీతి ననుచుఁ బలికె.

251


గీ.

కంబుకంథరుఁడన నొక్కకమఠవిభుఁడు
వికటసంకటులను హంసవిభులు మున్నుఁ
గూడి చరియింతు రొకపెద్దకొలనిలోన
మైత్రి యొనరించి నిశ్చలమానసముల.

252


వ.

అందుఁ జిరకాలం బుండ ననావృష్టిదోషమ్ము వచ్చె నయ్యవస
రంబున.

253


ఉ.

చండకరాంశుజాలము కృశానుశిఖావళిమాడ్కి నుగ్రమై
నిండె దిశాంతరాళముల, నీరజషండము నాళపంక్తితో
నెండె, సరోవరమ్ముల, నహీనతటాకములన్, ఝషమ్ము లొం
డొండొండఁ గృశమ్ములై సొరిగె నుష్ణజలంబులు దమ్ము నేఁపఁగన్.

254


వ.

అట్టిసమయంబున వికటసంకటు లన్యసరోవరంబున కరుగ నిశ్చ
యించినఁ, గంబుగ్రీవుండు వారలం జూచి.

255


మ.

నను బాయందగదయ్య మీకు నేను నన్యాయంబు మీ రెందుకై
నను గొంపొం డిదె వత్తు నే ననిన నానందమ్ముతో హంస లి
ట్లను నిక్కాష్ఠము బూని వచ్చెదము మధ్యంబొప్ప దంష్ట్రించి ర
మ్మనినం దద్విధ మాచరింప నవి య ట్లాకాశమార్గంబునన్.

256


వ.

అధికజవమ్మునం జన, జనమ్ము తమ్ముం బొడగని యిది చిత్రమ్మని
నవ్వుచుండఁ గాష్ఠమధ్యమ్ము గఱచియుండియు నవివేకమ్మునం గలకల
మ్మేమి యని వికటుసంకటల నడుగంబోయి, నేలంగూలి మృతింబొందె. నవ్వి
ధంబున మిత్రుండని నన్ను నెఱుంగక యేమేనియుం బలుక నూహించిన జడ
నిధియుం జెడునని యతండు సతిం జూచి వెండియు నిట్లనియె.

257


ఆ.

ధాత్రిలో, ననాగత విధాత, యుత్పన్న
మతి, భవిష్యమతియు, మహి ననంగ
ముగురు మీనపతులు మోదమ్ముతోఁ గల
రందు నొకడు చచ్చె ననఁగ వినవె.

258