పుట:పంచతంత్రి (భానుకవి).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అవునె పాపులార యతిథియై వచ్చిన
యంచఁ జంప నీతి యగునె యనిన
దేహ ముంట చాలు తెగి ధర్మ మెల్లను
బ్రబలుచుండు దీనఁ బ్రౌఢిఁ జెడదు.

247


వ.

అని కొన్నియుపాయమ్ములు కాండోద్భవునకు నెఱింగించిన
నతండును నాఁకఁటిపెల్లున నూరకుండిన నదియ సమయం బని కాకంబు లెల్లం
గూడికొని నిద్రించుచున్న రాయంచను వధియించి యందఱు భక్షించిరి.
నాకును నట్టిది యగునని తలపోసి ధైర్యంబు దెచ్చుకొని రాజతేజం బజేయం
బైనను నిప్పుడు సంగరం బొనర్చుట కర్తవ్యం బని నిశ్చయించి వృషభేం
ద్రుండు దమనకుం జూచి యిట్లనియె.

248


చ.

సమరముఖంబునం బడిన స్వర్గము, గెల్చిన లక్ష్మి గల్గు, కా
యము లనయంబు బుద్బుదములట్ల, మదిం దలపోసి చూడ దు
ర్దమ మగుశక్తిఁ బోరెద మదంబ మదీయహృదంతరంబునం
దమర మృగేంద్రుతోఁడ, నను నప్పుడు సూడుఁడు మీరలందఱున్.

249


వ.

అనిన దమనకుం డిట్లనియె శత్రువిక్రమం బెఱింగియు నెవ్వండేని
విరోధమ్ముఁ జెందు నతండు డిట్టిభమ్ముచేత సముద్రంబునుం బోలె పరాభ
వమ్ము నొందు ననిన సంజీవకుండు విస్మయమనస్కుండై తత్కథాక్రమం
బెఱింగింపు మనిన దమనకుం డిట్లనియె.

250


సీ.

వనధితీరమ్మున వసియించి టిట్టిభ
                    పతి యుండ నొక్కనాఁ డతనిపత్ని
గర్భిణియై యిది కల్లోలతతి నపా
                    యస్థలం బెచ్చటికైన నరుగ
వలయునన్నను, నర్ణవంబునకేల యి
                    ట్లాత్మలోఁ గలఁగ నాయంతవాఁడె
యీ సముద్రుఁడు! నన్ను నేమి సేయఁగ, నోపు
                    నరయ నిద్దఱికి మహాంతరమ్ము


గీ.

తెలియ కేమని యూహించి పలికెనేని
కాష్ఠమధ్యమ్ము గఱచిన కచ్ఛపమ్ము