పుట:పంచతంత్రి (భానుకవి).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు హంసకాకములయుద్ధమ్ము మాన్పి యావృద్ధహంసంబుఁ
జేరి యెందులవాఁడ వని యడిగిన నది తనవృత్తాంతంబంతయుఁ జెప్పిన విని
కాకరాజు కృపాపరిపూర్ణుండు గావున నయ్యంచను తనపంచ నుంచుకొని
సకలభోగమ్ములం బరితుష్టునిం జేసి యంత వాని కొకయిఱుకుపాటు గల
దని విచారించుకొని యున్నంత.

239


క.

వడితో శంపాజాలము,
వడగండ్లును గురియదొడఁగె వడి చెడక, ముదం
బెడల జడితట్టి యశనము
లుడిగెను కాకమ్ములకును నుర్విని లక్ష్మా!

240


క.

కడు బలిభుక్కులు వడవడ
వడ వణఁకుచు మేపు లేమి వరటియు వానన్
బడి యీఁద గాలిచేతను
సుడియుచుఁ బతిఁ జేరి ముడిగి స్రుక్కుచు మఱియున్.

241


వ.

ఇట్లని విన్నవించె.

242


ఆ.

వానగాలిచేత [1]వడలెల్ల స్రుక్కెను
తరులఫలములెల్ల ధరణిఁ గూలె
వాన తెలియదాయె దీనికి నొకవిధం
బానతిండు మీర లనఘచరిత.

243


వ.

అనిన విని బలిభుగ్వల్లభుండు తమవారల కిట్లనియె.

244


క.

ఆఁకఁటచేతను మీరలు
చీకాకును బొంది వచ్చి చిటులుచు నున్నా
రేకమతిఁ బక్షిజాతికిఁ
బ్రాకటఫలసంగ్రహమ్ము పాల్ప డెందున్.

245


క.

అన విని కాకులు మనకును
ఘనమగు నాహారసమితి గలిగున్నది యీ
డనె యంచఁ జంపి తిందము
ననవుడు నా మాట వినియు నాగ్రహ మెసఁగన్.

246
  1. ఒడలని సంస్కరించినచో యతిభంగము.