పుట:పంచతంత్రి (భానుకవి).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

గోదంతితురగకన్యా
మేదిని దానములకంటె మిక్కిలి యధికం
బేదనిన నభయదానం
బాదరమున నెఱుఁగు లక్ష్మణామాత్యమణీ!

225


క.

శరణన్నవానిఁ గాచిన
హరిమేధక్రతువుకంటె నధికఫలంబున్
సిరియును దత్పురుషవరున్
గర మొప్పుగఁ బొందు ధరణిఁ గరణికలక్ష్మా!

226


చ.

అని మఱియున్ మృగేంద్రుఁ డను నాతనితో నిపు డెట్లు చంపనే
ర్తును నకటా! యెఱింగి యని దోషముగాదె తలంపనన్న, ని
ట్లనుఁ దన ప్రాణరక్షకొఱకై యనఘాత్మక యెవ్విధం బొన
ర్చినఁ గలుషమ్ము చేకురదు చింత భవన్మతి నేల సారెకున్.

227


వ.

మీ రంగీకరించిన నేమే వధించెదమన నతండు క్షుథాజ్ఞానప్రవే
శంబున నూరకుండె నంత కాకజంబుకవ్యాఘ్రంబులు మువ్వురుఁ గూడి
కొని యుష్ట్రంబునున్ బొరిగొనుట కిదియ వేళయని కపటోపాయంబునఁ గథ
నకుం గూర్చికొని మెల్లన డాసి యారాజుతో నిట్లనిరి.

228


క.

అడవులఁ బడి తిరిగితి
మెక్కడ నాహారమ్ము నీకుఁ గానము నీవి
ప్పుడు మము నెవ్వరినైననుఁ
దడయక భక్షింపుమని ముదంబున మఱియున్.

229


క.

భావింప నింతకాలము
దేవరకృపచేత బ్రతికితమి మీకొఱకై
జీవము విడిచిన నేమీ!
భూవలయంబుననుఁ గీర్తి బొందమె యనుచున్.

230


వ.

విన్నవించి యామువ్వురిలోఁ గాకంబు మృగపతిని డగ్గఱి దేవా!
నను భక్షింపుమనిన నది నవ్వి నాపంటిసంధికిం జాలవు పొమ్మనిన నది
కడకుం దొలంగె జంబుకం బేతెంచి నన్ను నమలుమనిన కబళమాత్రంబునకుం