పుట:పంచతంత్రి (భానుకవి).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధికిని దోడ్కొనిపోయి యకలంక మృగరాజుఁ
                    గాన్పింపఁజేతుము ఘనతరముగ
ననుచు లొట్టియను దామనువుగాఁ దోడ్కొని
                    పొడగానిపింపగఁ బొంగి హరియు
నభయంబు నిచ్చి యత్యాసక్తిఁ గథనకుం
                    డనుపేరు నిచ్చి నిత్యాంతరంగుఁ


గీ.

డుగను గృపఁజేసి సంతోష మగణితముగఁ
బ్రోచుచుండంగ నుండె నా ముసలియుష్ట్ర
మరయఁ గొన్నాళ్ళు జన ననుచరులఁ జూచి
చెలఁగి మృగపతి యిట్లని పలికె వేడ్క.

219


క.

కాకం బాదిగ మువ్వుర,
నాఁకలి పెద్దగుచునుండె నాహారము మీ
రేకమతిఁ దెచ్చి యిండనఁ,
గాకియు సకలమ్ము వెదకి క్రమ్మఱ విభుతోన్.

220


గీ.

చూడఁగలచోటులన్నియుఁ జూచి వచ్చి
తిమి మృగాధిప మాంసము తెగువదొరక
దనుచు లొట్టియ యొక్కటి ఘనతనున్న
దదియు నీకును నాహారమగుత నేఁడు.

221


వ.

అని, మృగపతికి నుష్ట్రమ్ముమీఁది కోర్కె వెగ్గలంబగుటకు నీర
సంబున బలిభుగ్జంబుకతరక్షువులు తమమీఁది మైత్రి సడలుట జూచి,
యెడయఁ జెప్పిన నక్కంఠీరవేంద్రుండు తద్వాక్యంబులు విని కర్ణకఠోరం
బగుడుఁ గంటకభోజనున కభయం బొసంగితి నే నెట్లు చెఱుతు నన, ననుచర
మధ్యంబునుండి వాయసప్రభుం డిట్లనియె.

222


ఉ.

తెంపున నాలుబిడ్డల నతిక్షుథకుం బతి పాపవృత్తి శం
కింపక యమ్మడే! ధరణిఁ గ్లేశమునందినవానికిం గృపా
సంపద కల్గ నేర్చునె! విచారము లేమిటి కుష్ట్రవల్లభుం
జంపి భవచ్ఛరీరము నిజంబుగఁ బ్రోవు మృగేంద్రచంద్రమా!

223


వ.

అని చెప్పిన విని కరుణార్ద్రచిత్తుడై వెండియు నిట్లనియె.

224