Jump to content

పుట:పంచతంత్రి (భానుకవి).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూరపూగఖర్జూరనారంగులుంగలవంగపనసవకుళామ్లాతకాదిముఖ్య
వనంబై నృత్యరంగంబునుంబోలె నటనటీశోభితంబై శరన్నభోభాగమ్మునుం
బోలె చక్రబాణాసనవిరాజితంబై భారతసమరస్థలంబునుంబోలె నర్జున
రమ్యంబై రమణీజనవదనశృంగారంబునుబోలె చందనతిలకరమణీయంబై
యొప్పు నవ్వనంబునందు.

215


క.

కలఁడు మృగేంద్రుం డతనికి
బలిభుగ్జంబుకతరుక్షుపతులు సచివు లం
దుల వారు దిరుగుచు నుభయ
కలితుండగు నుష్ట్రవిభునిఁ గని వాక్ప్రీతిన్.

216


సీ.

ఉష్ట్రకులేంద్ర! యెందుండి నీరా కన,
                    నేను వర్తకు నోసరించి యిచట
నణకువ నున్నాఁడ నన విని వారలు
                    నావిధం బెట్లని యడుగఁ, జెప్పె
దను విను స్వర్ణకుండను బేరి బహుపదా
                    ర్థము సంగ్రహించి పరాగమైన
త్రోవను బేరంబు తులదూఁగి యాడంగ
                    సమకట్టి గోనెను సకలధనము


గీ.

పూని నావీఁపుపై నెత్తి కాననమున
నరుగ భారము నధికమై యాఁగికొనఁగ
నొక్కచరిలోన నాగోనె చక్కవైచి
మున్ను నిచ్చట దాఁగితి ముదము దఱిగి.

217


వ.

అంత నాస్వర్ణకుఁడు నన్నుంగానక సకలకాననగిరిగహ్వరంబుల
నెమకి, విసివి తననివాసంబునకుం జనియె, నాఁటంగోలె నేనును వర్తకునకు
వెఱచి స్వర్ణభారంబు మోవంజాలక యిం దణంగియున్నవాఁడ, నాభాగ్య
వశంబున మిమ్ముం బొడగంటి ననిన, గాకజంబుకతరక్షువులు సంతసిల్లి
యిట్లనిరి.

218


సీ.

లొటిపిట్ట నీకును లొంగంగ నేటికి
                    భయమేల నీకు మాభర్తసన్ని