పుట:పంచతంత్రి (భానుకవి).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నెలలు ముఖేందునం దమర, నిష్ఠురదంభము మానసమ్మునన్
దలముగఁ బొల్చు దుర్జనుఁడు ధాత్రితలంబున లక్ష్ముధీమణీ!

210


సీ.

బహుళాంధకారంబు వాప దీపము జీవ
                    నంబుల దాఁటంగ నావ భద్ర
దంతావళముల మదం బణఁపఁగ నంకు
                    శము పన్నగముల రోషంబు చెఱుప
గారుడమంత్రంబు ఘనతరాఘంబుల
                    హరియింప ధర్మువు నతిదరిద్ర
బాధ దీర్పంగ సంపద శోకముల నోటు
                    పఱుప నానాకళాప్రౌఢిమయును


గీ.

బ్రేమమున నబ్జభవుఁడు గల్పించెగాని
చేయ నోపంగ లేడయ్యెఁ జెనఁటిహృదయ
దంభ మొక్కింత మాన్పంగ ధాత్రిలోన
లాలితోదార విఠ్ఠయ లక్ష్ముధీర!

211


వ.

అని చెప్పిన విని వృషభేంద్రుండు చింతాపరవశుండై తనలో
నిట్లనియె.

212


ఉ.

గాలముఖమ్ము మేఁతలకుగా నతిసంభ్రమవృత్తి నేఁగి, మీ
నాలి జనమ్ము చేత హతమైన విధమ్మున నల్పబుద్ధి వాం
ఛాలసచిత్తుఁడై మడియు, నాదిఁ బురంబులత్రోవఁ బోవలే
కీ, లయమంద వచ్చితి మృగేంద్రునివాక్యము విశ్వసించితిన్.

213


వ.

అనిన విని దమనకుండు సంజీవకుం జూచి.


గీ.

అల్పులైనట్టి మాంత్రికులైన, వైద్యు
లైనఁ, బల్వురు గూడిన నౌషధమ్ము
లొనర నేమైన నిత్తురు నుష్ట్రవిభుని
నాదిమంబునఁ గాకాదు లట్ల తలఁప.

214


వ.

అని చెప్పిన విని సంజీవకుం డాకథ యెఱింగింపుమనిన దమనకుం
డిట్లని చెప్పదొడంగె. ము న్నొకవనంబు నింబకదంబౌదుంబరజంబూ
జంబీరమాధవీమధూకోద్దాలసాలహింతాలమందారసిందువారబీజ