పుట:పంచతంత్రి (భానుకవి).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చెవిటి కేకాంతమ్ము సెప్పిన కరణి కృ
                    తఘ్నునితోడి మిత్రతవిధమున
జడధిఁ జిన్కిన వృష్టి వడువున నూషర
                    స్థలములఁ జల్లు బీజముల పగిది
షండుండు కన్య విచారించు పోలిక
                    పందికి చందనపంకమట్లు


గీ.

నతివివేకవిరహితాత్ముండు నగు మహీ
పతికి నాచరించు హితవు నిష్ప
లంబు నీతి ఘనకళాచతురుం డది
దెలియవలయు లక్ష్మ! ధీసమేత!

205


క.

దండింపఁదగనివారల
దండించిన, దండమునకుఁ దగువారి కృపన్
దండింపకున్నఁ జెడు భూ
మండలనాథుండు లక్ష్మమంత్రివరేణ్యా!

206


వ.

అని చెప్పి వెండియుఁ గపటరహితహృదయుండనగు నన్ను
మృగేంద్రుం డట్లు చేయఁదలంచె నది ప్రాక్తనకర్మఫలమ్ము గానోపునని
నిట్టూర్పు నిగిడించుచు మఱియు నిట్లనియె.

207


చ.

సరసుల నక్రముల్, మలయజంబులఁ బన్నగరాజు, కేతకీ
తరువులఁ గంటకమ్ములు, నిధానములన్ బహుభూతముల్ సుధా
కరునిఁ గళంకమట్లు నధికంబుగ, దుర్దశ లుర్విలోన స
త్పురుషులఁ బొందుచుండుఁ దమపూర్వకృతంబగు పాతకంబునన్.

208


క.

అన విని దమనకుఁ డిట్లను
ననఘ! మృగేంద్రుండు గడుఁబ్రియం బొనరించున్,
మనమున నది నమ్మకు దు
ర్జనలక్షణ మదియె మది విచారింపఁ దగున్.

209


చ.

మలయజశీతలమ్ములగు మాటలఁ దేల్చును, వచ్చినంతఁ బెం
పలవడ లేవఁ జూచునుఁ బ్రియంబు లొనర్చును లేఁత నవ్వు వె