పుట:పంచతంత్రి (భానుకవి).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యివ్విధంబున రాజనీతిక్రమంబు విన్నవించినఁ బింగళకుం
డాకర్ణించి దమనకుతో నిట్లనియె. నయ్యా! యాసంజీవకునందు నాకుం
బక్షపాతంబు బెద్దయైయుండు నతండును నాయందు నట్ల. అతనియందు
దోషమ్ము లేనియట్లున్నది. అస్మత్కార్యమ్ముపట్ల కంటిని ఱెప్ప గాచి
నట్లు నాకుం గన్నాకై యున్నాడు. ఇట్టి పెద్దను దుర్నీతిచేత నెడయం జేసి
కొనుట కార్యమ్ముగాదనిన దమనకుం డిట్లనియె.

183


క.

సుతుఁ డనుచుఁ జుట్ట మనుచును
హితుఁ డనుచును నమ్మవలన దెఱుఁగనిరీతిన్
మతిదృష్టిఁ దెలియవలయును
బతు లారయ వారి నూత్నభరతాచార్యా!

184


క.

మంత్రుల బుద్దుల వినక, కు
మంత్రులవాక్యములఁ దిరుగు మనుజేంద్రుఁడు చా
తంత్రమున బాసి పగతుర
యంత్రమ్ములఁ జిక్కువడు మహాత్ముండైనన్.

185


వ.

అని చెప్పిన మృగేంద్రుఁ డిట్లను నే నతని కభయం బొసంగితి నా
వృషవరేణ్యు నెట్లు నిగ్రహింతు నది యకర్తవ్యంబు. కాదని చేసితినేని పర
లోకహానియు నపకీర్తియు నగు, నతని హృదయంబువ దోషంబించుకయును
లేదు, అధికతరప్రియం బబ్బుచున్నది యనిన దమనకుండు నిట్టూర్పు నిగిడిం
చుచు వెండియు నిట్లనియె.

186


గీ.

కావ్యమతము రిపునికాయమ్ము నెవ్విధి
నైన జెఱుగవచ్చు, నఖిలసమ్మ
తంబు, మైత్రిఁ జేసి దంభభావమునఁ జ
రించువాని నట్ల త్రుంచవచ్చు.

187


వ.

రాజులకుఁ దలంప వీరధర్మంబు కారణంబు ధర్మాధర్మమ్ములు
విచారించిన రాజ్యం బెట్లు సిద్ధించు విరోధులగు కపటాత్ములం బొలియించు
చుటయు, నాప్తవాక్యంబు లాకర్ణించుటయు, నేర్పు గలిగి కార్యంబులపట్ల
ప్రవీణుం డగుటయు, రణధైర్యంబు గల్గుటయు, నను రాజగుణంబు లెఱుంగ
వలయు నవివేకపరిపూర్ణంబై యున్నది భవదీయహృదయంబున నాహితంబు
ప్రవేశింపఁ జోటు లేదని మఱియు నతం డిట్లనియె.

188