పుట:పంచతంత్రి (భానుకవి).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

గర్ణపర్వముగను గ్రమము దప్పక యుండ
...................చెప్పుమనిన నతఁడు
...........................శివశర్మ
.......యనగ గలడు ..........ఘనుఁడు.

126


గీ.

అతఁడు చిరకాల మార్జించినట్టి ధనము
దనర నొకబొంతలోన గుప్తమ్ము నేసి
బడుగు నోడలికిఁ దొడవుగాఁ దొడిగి దాని
విడువ కెప్పుడు దిరుగుఁ దద్విధము దెలిసి.

127


వ.

ఆషాఢభూతియను దురితాత్ముం డది యవహరించువాఁడై యా
భిక్షుం జేరి మహాత్మా! నేను నీకు శిష్యుండనై పరిచర్యసేయువాఁడనై
వచ్చితి నన్నుఁ బరిగ్రహింపుమనిన నాతండును వానివిధమ్మునకు మెచ్చి
కపటత్వ మ్మెఱుంగకయుండె నాకపటశిష్యుండును బనులయెడ విశ్వసిం
పన్ జేయుచు కిల్బిషరహితహృదయుండునుంబోలె పాయక శుశ్రూష
సేయుచుండె నంత కొన్నిదినమ్ములకు భిక్షుం డతని నమ్మి తన యెడలి
కుబుసం బతనిచేతి కిచ్చి పదిలంబని చెప్పి వనోపకంఠమ్మున కాచమనార్థం
బరిగి యందలితటాకతటమ్మున నవక్రపరాక్రమమ్మునం బోరు మేష
ద్వయంబుఁ జూచుచుండె నప్పుడు.

128


క.

ఒండొకటిఁ బాసి తాఁకుచు
నుండఁ దల ల్పగిలి రక్త ముబ్బుచునుండన్
అండములు వెడల జవురుచుఁ
గొండలక్రియఁ బొల్చె మేషకుంజరము లిలన్.

129


క.

ఆలోపలఁ జనుదెంచి సృ
గాలం బొక్కటి కృతాంతకప్రేరితమై
కీ లెఱుఁగక నడుమంబడి
కూలెన్ గీలాలవాంఛ కుంభినిమీఁదన్.

130


గీ.

అపుడు శివశర్మ మది విస్మయంబు నొంది
జంబుకము గూలె మేషయుద్ధమ్ముచేత
ననుచుఁ దనటెంకి కేతెంచునంత బొంత
పుచ్చుకొనిపోయె నాషాఢభూతిగాఁడు.

131