పుట:పంచతంత్రి (భానుకవి).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అట్లు కావున నిర్భయమ్మున నచ్చటి కరిగితి నీకును నతనికి మైత్రి సంఘ
టింతు నతనిం దోడ్కొని చనుదెంచెద నిక్కార్యమ్మునకు సమ్మతంబగునే
యనం గంఠీరవసత్తముండు కౌతుకాయత్తచిత్తుండై తత్ప్రయోజనం
బాచరింపుమని యాలింగనమ్ము చేసి యనిపినం, జని యో ఋషభేంద్రా!
మృగేంద్రుఁడు నీ కభయ మ్మిచ్చె నీకార్యమ్ము సర్వమ్ము నతని కెఱింగిం
చితి నీవును గృతార్థుండవైతి వమ్మహాత్ముని దర్శనమ్మున కేతెమ్మనిన
నతండు.

122


ఆ.

సంతసమ్ముతోఁడఁ జనుదెంచి వందనం
బాచరింప నతని నామృగేంద్రుఁ
డాదరించె నప్పు డాలింగనమ్మునఁ
గరము సొంపు మిగులఁ గౌతుకమున.

123


గీ.

అప్పు డిరువురు మైత్రిఁ బెంపారఁజేసి
స్వర్ణమురుమణివిధమున సంతతంబు
గలసిమెలసియు నుండిరి బలిమి చేటు
పాటు మదిలోపలను దలంపక ముదమున.

124


వ.

ఇట్లు సింహవృషభేంద్రులు జంబుకనిమిత్తంబున మైత్రిఁజేసి సుఖం
బుండి రంత కొంతకాలమ్ము చనినసమయమ్మున మృగాధిపతి వృషేంద్రు
పసలంబడి యొండెఱుంగక యతండును దానును భోజనమజ్జనశయ్యాసన
పానసౌఖ్యమ్ములఁ బ్రొద్దుపుచ్చుచు దమనకు మఱచిన నతండు పురపురం
బొక్కుచు తన్ను విచారింపకునికిం జేసి క్షుధార్తుండై కరటకుం గూడికొని
యుండె నందు.

125


సీ.

దమనకుం డను మున్ను ధాత్రిపై మేషసం
                    గ్రామంబుచే జంబుకంబు భిక్షుఁ
డఘమానసుండగు నాషాఢభూతిచే
                    వడి మంగలియుఁ దంతువాయుచేత
తమతమ చేయునేరముల మోసము నొంది
                    నట్ల [నా]బుధ్ధిశూన్యత దలంప
నిట్ల యయ్యె నటన్న నెంతయుఁ బ్రీతితో
                    గరటకుం డీమూడుకథలు నాకుఁ