పుట:పంచతంత్రి (భానుకవి).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జవ మొప్ప జడియ కతఁ డి
ట్లు విచారము సేసె నాత్మలోఁ గడుబ్రీతిన్.

108


గీ.

అధికభోజన మిది గల్గె ననుచు లంబ
కర్ణుఁ డాభేరి చించి సకౌతుకముగ
నందుఁ జొరబడి వెడలె నిరాశుఁ డగుచు
నట్లు గావున నిది తెలియంగవలయు.

109


వ.

వచ్చిన శబ్దంబునకు భవన్మనంబున సాధ్వసం బేటి కిదె సర్వంబును
దెలిసి చనుదెంచెదనని తద్వనిమార్గమ్మునం జని వాని ముందట

110


మ.

కనియెన్ భూధరసన్నిభాంగు నతి తీక్ష్ణ......
.. ........నిజవాలసంచలనభూవాతూలనిర్ధారితా
భ్రనికాయున్ మృగయూథకర్ణకుహరోగ్రధ్వానునుద్యత్కకు
ద్ఘనభూషాంచితగర్వనిర్వహణవిద్యాంకున్ గకుద్మత్ప్రభున్.

111


మ.

కని గోవల్లభ! యిట్టు లొంటిఁ దిరుగంగా నేల యొక్కండ వి
వ్వనమార్గంబున నీకథావివరముల్ వాక్రుచ్చి నాకంతయున్
వినుపింపన్ దగునేనిఁ జెప్పుమనినన్ వీక్షించి యాద్యంతమున్
దనవృత్తాంత మెఱుఁగఁజెప్పె నతిమోదం బాత్మ సంధిల్లఁగన్.

112


వ.

ఇట్లు చెప్పిన నవ్వృషభేంద్రుండు జంబుకప్రభుం జూచి యయ్యా!
భవన్నామం బెయ్యది నన్ను డాయం జనుదెంచుటకుఁ గతం బేమి యెఱింగింపు
మనిన నతం డతని కిట్లనియె నేను దమనకుం డనుపేరుగలవాఁడ మృగనా
థుండు మన్నాథుండని చెప్పి వెండియు నిట్లనియె.

113


మ.

మదదంతావళ[కుంభసంభృతిలస]న్మాంసాన్నముల్ నిచ్చఁ బెం
పు దలిర్ప న్దిని మేనువొంగ సతతంబున్ శౌర్యగాంభీర్యసం
పదఁ బెంపొందిన సింహవల్లభునకున్ బంటన్ వృషాధీశ! కూ
ర్చెద మన్నాథుని నీదు స్నేహమునకున్ సిద్ధమ్ము వేడందగున్.

114


వ.

అనిన సంజీవకుండు దమనకుం జూచి యతనికి నాకు మిత్రత్వం బెట్లు
సమకూడు! మృగేంద్రుం డతులబలపరాక్రమసంపన్నుం డే నల్పబలుండ నఖిల
గుణంబులు సమంబైనఁగదా! సంధించవలె ననిన విని దమనకుం డిట్లనియె.

115