ఇందు దూబగుంట నారాయణకవి గ్రంథము మొదటిది. కీ॥ శే॥ శ్రీ డాక్టరు చిలుకూరి నారాయణరావుగారి పరిశోధనవలన, వేంకటనాథ కవి యచ్యుతదేవరాయలకు సమకాలికుఁడని తేలుటవలన, ప్రకృతమగు నీ భానుకవి పంచతంత్రము రెండవదియును, వేంకటనాథునిది మూఁడవదియు నగుచున్నవి.
కృతికర్త
తిప్పయభాస్కరునిఁ గూర్చి, యీ కావ్యప్రస్తావనలో నున్న—
మ. | “పరవాగ్వైఖరి, లక్షణజ్ఞతను, శ్రీవత్సాన్వయఖ్యాతి, భూ | |
యీ పద్యము వలన, నీతఁడు లాక్షణికుఁ డనియును, శ్రీ వత్సగోత్రజుఁ డనియును, రాజసభాపూజ్యుఁ డనియును, ప్రాచీనకావ్యభంగుల నెఱిఁగినవాఁ డనియును దెలియుచున్నది. ఆశ్వాసాంతగద్యములలో "భారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రిపుత్ర, సుజనవిధేయ, భానయ నామధేయ" ఆని యుండుట వలనఁ, దండ్రిపేరు తిప్పయ యనియును, నితనికి భానయ యనికూడ వ్యవహారమున్నట్లును, దెలియుచున్నది. కావ్యాంతమున, నితఁ డిట్లు చెప్పికొనెను,—
సీ. | పంపా విరూపాక్ష భైరవ విఠ్ఠలే | |
గీ. | రమ్యమై యున్న విద్యాపురంబుసంధు, | |