పుట:పంచతంత్రి (భానుకవి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెనుఁగు బాస నొనర్చెను వినుతికెక్క
నవని నాచంద్రతారార్క మగుచు నుండ.

దీనివలన కృష్ణదేవరాయల పరిపాలనకాలమున నీతఁడు విద్యానగరమునం దుండి యీ కావ్యమును రచించినట్లు తెలియుచున్నది. ఏతత్—

కృతిపతి

భండారు లక్ష్మీనారాయణుఁడు (ఈతనికి లక్ష్మమంత్రి యనియును, లక్ష్మయమంత్రి యనియును గూడ వ్యవహారము) శ్రీకృష్ణదేవరాయల యంతఃపురమున నాట్య, సంగీతవిద్యలకు నాచార్యుఁడు. ఈయన గొప్పవిద్వాంసుఁడు. సంస్కృతమున “సంగీతసూర్యోదయ” మనుపేర నుత్తమమగు నొక నాట్య, సంగీత లక్షణ గ్రంథమును రచించెను. అది తాళ, నృత్త, స్వరగీత, రాగజాతి, ప్రబంధాధ్యాయములను నైదుప్రకరణముల గ్రంథము.

ఆ గ్రంథము యొక్క ప్రస్తావనలో శ్రీకృష్ణదేవరాయలవిజయయాత్రలను, తనకు రాయ లొనరించిన సన్మానవిశేషములను, నీ లక్ష్మమంత్రి యిట్లు పేర్కొనెను.

శ్లో.

కర్ణాటాహ్వయదేశసౌఖ్యజననీ శ్రీతుంగభద్రావృతా,
మాతంగోన్నతమాల్యవత్క్షితిధర......ర్వతా,
పంపాధీశ్వర విఠ్ఠలేశ్వర కృపాదృష్టిప్రభామండితా
శ్రీ విద్యానగరీ విభాతి ధరణీ మాణిక్య ధమ్మిల్లవత్.


శ్లో.

తస్యాం కాంచనమంటపే పరిలసన్మాణిక్యహీరావళీ
ప్రాంతప్రోతవిశుద్ధమౌక్తికమణిశ్రేణీరవైరంచితం
ఆరుహ్యద్విరదారి పీఠమతులం క్ష్మామీశ్వరస్యాత్మజో
నిస్తంద్రః ప్రశశాస తుర్వసుకులోత్తంసో నృసింహో నృపః.


శ్లో.

కీర్తి స్ఫూర్తిభిరహ్న్యపి ప్రతికలం జ్యోత్స్నాం పరాంజృంభయన్
సద్వర్త్మ న్యభికామితేన సకలాన్ సంప్రీణయన్ ప్రాణినః
నిత్యాభిశ్చ కలాభిరుత్సుకతరం ధిన్వన్ బుధానాం వ్రజాన్
తస్మాద్దుగ్ధపయోనిధె రివ విధు శ్రీకృష్ణరాయో౽జని.