| తెనుఁగు బాస నొనర్చెను వినుతికెక్క | |
దీనివలన కృష్ణదేవరాయల పరిపాలనకాలమున నీతఁడు విద్యానగరమునం దుండి యీ కావ్యమును రచించినట్లు తెలియుచున్నది. ఏతత్—
కృతిపతి
భండారు లక్ష్మీనారాయణుఁడు (ఈతనికి లక్ష్మమంత్రి యనియును, లక్ష్మయమంత్రి యనియును గూడ వ్యవహారము) శ్రీకృష్ణదేవరాయల యంతఃపురమున నాట్య, సంగీతవిద్యలకు నాచార్యుఁడు. ఈయన గొప్పవిద్వాంసుఁడు. సంస్కృతమున “సంగీతసూర్యోదయ” మనుపేర నుత్తమమగు నొక నాట్య, సంగీత లక్షణ గ్రంథమును రచించెను. అది తాళ, నృత్త, స్వరగీత, రాగజాతి, ప్రబంధాధ్యాయములను నైదుప్రకరణముల గ్రంథము.
ఆ గ్రంథము యొక్క ప్రస్తావనలో శ్రీకృష్ణదేవరాయలవిజయయాత్రలను, తనకు రాయ లొనరించిన సన్మానవిశేషములను, నీ లక్ష్మమంత్రి యిట్లు పేర్కొనెను.
శ్లో. | కర్ణాటాహ్వయదేశసౌఖ్యజననీ శ్రీతుంగభద్రావృతా, | |
శ్లో. | తస్యాం కాంచనమంటపే పరిలసన్మాణిక్యహీరావళీ | |
శ్లో. | కీర్తి స్ఫూర్తిభిరహ్న్యపి ప్రతికలం జ్యోత్స్నాం పరాంజృంభయన్ | |