పుట:పంచతంత్రి (భానుకవి).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ్ములనాడఁ దొడఁగుచుందురు
కలియుగమున ద్రవ్యహీనుఁ గరణిక లక్ష్మా!

71


క.

మృతిఁ బొందిన నరునైనను
హితులెల్లను డాయుదురు మహీస్థలిలోనన్
మతిఁ దలఁపఁ బేదఁ జేరరు
బ్రతిమాలిన నొరులు నూత్నభరతాచార్యా!

72


చ.

అతిబలవంతుడైన వినయమ్మున నాతనితోడి మైత్రి సం
తతమును నిశ్చలంబగు మనమ్మునఁ జేసి నిజప్రదేశసం
గతుఁడయి పొల్చుటొప్పు, నది గాదని యొండొకదేశ మేగినన్,
ధృతిమెయిఁ బోరినన్, వినుము ధీయుత! నొచ్చు నతండు నేరమిన్.

పై మూఁడు కందములును నారాయణ కవి గ్రంథమున 2వ యాశ్వాసమున 108, 109, 110 సంఖ్యలలోను, దిగువ చంపకము తృతీయశ్వాసమున 30వ సంఖ్యలోను గనఁబడుచున్నవి. నూత్నభరతాచార్యా! కరణిక లక్ష్మా! అను సంబోధనలు మాత్రమే భానుకవివి.

ఇంత గ్రంథము వ్రాసిన కవికి నీ నాలుగు పద్యములను నితరకవి కావ్యమునుండి యెరవు తెచ్చికొనుటకుఁ గల కారణము తనకుఁ బూర్వుఁడగు నారాయణ కవియందు నీతనికున్న గౌరవభావమని యూహించుటకన్న వేఱొకటి సమంజసముగాఁ దోఁచదు. లేనిచోఁ గారణ మన్వేషింపవలసియున్నది.

శిక్షాసముచితవయస్కులగు బాలు రెల్లరును నీతిశతకములనువలెఁ గంఠస్థము చేయుటకు ననువగు సరళశైలిలో నీతిసారములను దఱచుగఁ గందములు; తేటగీతులు, నాటవెలఁదులవంటి చిన్న చిన్న పద్యములలో సూటిగ నమరించి, ధారణయోగ్యములగునటుల భానుకవి సంతరించెను. కావ్యగుణసంపాదనమునందు కన్న బాలావబోధనముగ నీతులను బొందుపఱుచుటయందే యితనికి దృష్టి యెక్కువ. ఇట్లనుటవలన నిందుఁ గావ్యగుణములు కొఱవడినవని కాదు. వానికై ప్రయత్నము లేదని భావము.