పుట:పంచతంత్రి (భానుకవి).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శూన్యంబైన మార్గంబునం జనుచుండ శిష్యుండును ........... పాత్రను జల
మ్ములు సంగ్రహించుక నడుమ బహిర్భూమికిం జని, కొన్నిజలమ్ముల నాచ
మనమ్ముఁ జేసి తక్కినజలమ్ములు సంగ్రహించుకొని వచ్చె, దానింజూచి గురు
విట్లనియె. శిష్యవర్యా! నాకు దాహం బధికంబైయున్నది. నీచేతిజలమ్ములు
నాకుం బోయుమనిన నతం డిట్లనియె.

43


ఆ.

అనఘ! గుదముఁ గడుగఁజన మిగిలున్న యీ
జలము నీకుఁ బోయఁజనదు నాకు,
బాపమందు ననుచుఁ బరుగునఁ బోవంగ
గురువుకూడఁ బోయి కొసరి యడిగె.

44


ఆ.

ఎట్టి జలములైన నేమైనఁ గానిమ్ము
యిచట దప్పిదీఱ యేను గ్రోలి
ప్రాణములను బ్రోచి పరగుదునన్నను,
దోయ మీకపోయె దోసమంచు.

45


క.

పోయెడి శిష్యునిఁ బట్టుక
కాయము రక్షింపుమనుచుఁ గాంక్ష నడిగినన్
బాయుమని యతనిఁ గడచుచుఁ
బోయఁగ వెసఁద్రోఁచి, జలము పాత్రను ఱాఁతన్.

46


క.

పగులగ నడిచినఁ గనుగొని
దిగులునఁ గుతికెండ నతఁడు దేహము విడిచెన్
అది కనుగొని యాశిష్యుఁడు
మదిఁ గలఁగుచుఁ జనియెఁ దనదు మందిరమునకున్.

47


క.

కావున, మనుజుం డుచితము
వేవిధముల నేఱుఁగవలయు విశ్వములోనన్
ఆవిధము నెఱుఁగకుండిన
నా వేఁదుఱునంటు నఘము లవనిలొ నాథా!

48