పుట:పంచతంత్రి (భానుకవి).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చెప్పిన పని విని యాకథఁ
జెప్పుమనిన మోహనాంగి చతురతతోడన్
దప్పక [పతి కీవిధమున]
గొప్పగు మతిఁ జెప్పఁదొడగెఁ గోరికలూరన్.

39


సీ.

నానాథ! విను మున్ను నళినసంభవునకు
                    వాసియౌ ననునట్టి బ్రాహ్మణుండు
బ్రహ్మచర్యంబున బ్రహ్మవిజ్ఞానంబు
                    జనియించి, మందిరస్థలిని నిల్వ
కాతండు గహన మత్యాసక్తితోఁ జొచ్చి
                    విశదస్థలమ్మున విమలుఁడగుచు
నాసీనుఁడై హరి ననవరతమ్మును
                    [ధ్యానంబు] సేయుచుఁ దగిలియుండ


ఆ.

నొక్కవడుగు వచ్చి గ్రక్కున నాతని
నాశ్రయించి హితము నడుగవలసి
శిష్యవృత్తి నుండ, చీకాకు పడి, వని
కారు చిచ్చు సొచ్చి కాలఁజొచ్చె.

40


ఇట్లు చైత్రవైశాఖమాసమ్ములలో మధ్యాహ్నకాలంబునఁ
జిచ్చు దవిలి యడవి కాలందొడంగిన సకలమృగంబులు, ఖగంబులు
రొదలు చెలంగఁ, బరువందొడంగె, నప్పు డాయోగి లేచి శిష్యుండు వెం
టరా, మృగంబు వోలె పరువందొడంగిన,—

41


ఆ.

పోయిపోయి కొంతప్రొ ద్దొక్కచోటను
నలసి నిలువఁబడిన యతనిఁ జూచి
శిష్యవరుఁడు నగ్ని శీఘ్రత వచ్చె, నిం
కొదుగరాదు మనకుఁ గదలు మనియె.

42


వ.

శిష్యునివాక్యమ్ము లాదరించి గురువును సాంద్రగహనగిరి
హ్రదమ్ములు దాఁటి చనుచో నతనికి దాహం బగ్గలంబై యెండందాఁకి, జల