Jump to content

పుట:పంచతంత్రి (భానుకవి).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆకుణపత్రయ మొక్కట
జోకగ భూఖాతమందుఁ జొప్పించి తనున్
రాకొమరు లెఱుఁగకుండగఁ
బ్రాకటముగ ధనము నింటఁ బాతుక యుండెన్.

15


వ.

ఇట్లు వైశ్యుండు లబ్ధద్రవ్యుండై సకలదారిద్య్రవిచ్ఛేదమ్ము చేసి
సర్వసౌఖ్యము లనుభవింపుచు బ్రాహ్మణపూజాతత్పరుండై బంధుజనపారి
జాతుండనఁ గళత్రలోలుండై సుఖంబుండినంత,—

16


క.

ఆకోమటికిని వశుఁడై
తేఁకువ నొకక్షౌరకుండు ధీయుతుఁడై, తా
జోకను బనిసేయుచుఁ దే
[1]జోకీర్తులు వెలసియుండు, సురుచిర మహిమన్.

17


క.

ఆమంగలి కోమటిసతిఁ
ప్రేమంబునఁ దగిలి యుండఁ, బ్రీతిని వణిజుం
డామంగలిసతిఁ గూడుక,
తామును నన్యోన్యసతులఁ దగులుక యుందుర్.

18


వ.

ఇట్లు త్రైవర్ణికక్షౌరకు లొకరొకరిభార్యలం గూడుక వినోద
మ్ములు సలుపుచుండునంత, నొక్కనాఁటిరాత్రి నాపితుఁడు కోమటి
భార్యతోఁ గూడి యుండి యిట్లనియె, భామా! భవద్గృహమ్ము పూర్వమ్ము
వలె గా దిప్పుడు వస్త్రాన్నంబులకుఁ గొదువలేక యుండిన యట్లున్నది యీ
విధం బెఱిఁగింపు మనిన, నది యిట్లనియె,—

19


గీ.

ముగురుభిక్షులు మాయింటి కగణితముగ
వచ్చియుండంగ మాసెట్టి వారిఁ బట్టి
చంపివేసినకతమున సకలధనము
కలిగియున్నది మా కని కాంత చెప్పె.

20


క.

చెప్పిన మాటలు మంగలి
తప్పక విని తాను నట్ల తాలుతుననుచు

  1. తేజఃకీర్తులని సంస్కరించినఁ బ్రాసభంగము