పుట:పంచతంత్రి (భానుకవి).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నొప్పుగఁ జని యంగడిలో
గొప్పగఁ దిరుగాడు భిక్షుకుల ముగురిఁ గనెన్.

21


గీ.

చూచి వారలఁ ౙంపంగ సొరిది నరిగి
భిక్ష మిడియెద రమ్మంచుఁ బిలిచి తెచ్చి,
తనదు నిలయమ్ములోనికి ధార్మికులను
దెచ్చి బంధించి చంపగఁ దివురుటయును.

22


క.

ఆసన్న భిక్షు లెఱిఁగియు
మోసంబని కూతలిడఁగ, మూగుర నొకనిన్
వే సమయింపగ, నంతటఁ
గాసిలి తలవరులు వచ్చి కని రవ్వారిన్.

23


వ.

ఇట్లు భిక్షుద్వయాంబష్ఠులఁ దలవరులం గనుంగొని యాపీనుఁ
గెక్కడిది యని యడిగిన యాజోగు లిట్లని తమవృత్తాంతంబుం జెప్పిన, నా
మంగలిం బట్టికొని రాజసన్నిధికిం దోడ్కొనిపోయి వాఁడు చేసిన దుర్వ్యవ
సాయంబు రాజునకు విన్నవించిన నతండు నాపితుని శూలప్రాప్తుం జేయు
మనిన, నాతలవరులు వానిం బంధించుకవచ్చునెడ, నాయంబస్ఠుం డిట్లనియె —

24


గీ.

నేన కాదు, యిట్టి నీచకృత్యము భౌమి
చేసినాఁడటన్న, వాసి నెఱిఁగి
వానిఁ బట్టుకొనియు వసుమతీపతి సమ్ము
ఖమునఁ బెట్టుమనియె [ఁగడఁక] నతఁడు.

25


వ.

ఇట్లు ధవుఁ డాగ్రహమ్మునఁ ద్రైవర్ణికాంబష్ఠకుల నిద్దఱిని శూల
ప్రాప్తులం జేసి వారిభార్యలవృత్తాంతంబుఁ జారులచేత విని, వారలమేనఁ
దైలాంబరమ్ములు చుట్టి యగ్నిఁ దగిలింపించె నంత—

26


క.

కావున నీవును నకులము
జీవము ద్రుంచితివి గాన చేడ్పడ నిన్ను
న్నావిధము సేయవలెనని
దేవియుఁ బతి కెఱుఁగఁ జెప్పి ధృతి నిట్లనియెన్.

27