పుట:పంచతంత్రి (భానుకవి).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోనాడి మిత్రుం గపిపుంగవుం బే
లై, నేఁడు హింసింతు నటంచు నెంచెన్.

21


వ.

వెండియుఁ దనమనంబున నిట్లని విత్కరించె.

22


క.

బలవర్ధుఁడు నాతోడన్
ఛలరహితుండగుచుఁ జెలిమిసారెకుఁ జేయున్
గలుషమతి నయ్యు నాతనిఁ
బలుకణఁచెదనంచుఁ దలఁచి పాపుఁడనైతిన్.

23


వ.

అని వివేచించుకయుండం గ్రమ్మఱ భార్యపై మోహమ్ము డగ్గఱిన,

24


సీ.

ఊహింప మిత్రసందోహమ్మునకు, నారఁ
                    బండిన సస్యమ్ము, బాంధవులకుఁ
గనుపండు వొనరించుఁ గల్పమహీజంబు,
                    వంశహేమమునకు వన్నె, గేహ
లక్ష్మికి నెంతయు లాలితంబగు భూష
                    ణంబు, వయస్యాజనంబులకును
దంగేటిజున్ను, బాంధవుల పాలిఁటికిని
                    ఫలియించు మించుతపఃఫలమ్ము
గాన, గుణమణిపూర్ణసాగర మనంగఁ
దగుకళత్రంబు, కరుణచే ధనమునట్ల
వసుమతీస్థలిఁ బాలింపవలసియుండు
లక్షణోపేంద్ర! విఠ్ఠయలక్ష్మ చంద్ర!

25


వ.

అని తనహృదయమ్మున వినిశ్చయంబు చేసికొని బలవర్ధన
హృదయార్ధియై దయాశూన్యుం డగుచు శింశుమారుండు వానరహృద
యమ్ము దెచ్చెదనని సఖీజనమ్మునకుం జెప్పి యంపించుక మందమందగమ
నమ్మున నౌదుంబరతరుసమీపమ్మునకు వచ్చునపుడు.

26


గీ.

వానరవరేణ్యు డప్పుడు వానిఁ జూచి
యొయ్యనొయ్యనఁ జనుదెంచుచున్నవాఁడ
వేమి యనవుడుఁ గైతవ మెఱుకపడక
యుండ, మృదువాక్యములఁ బల్కె నొప్పుమిగుల.

27