పుట:పంచతంత్రి (భానుకవి).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నధికమగు చింత మనమంత నలిమికొనఁగ
గ్రాహముఖ్యుండు గద్దదకంఠుఁ డగుచు.

15


ఉ.

ఈదురవస్థ నొందుటకు నేమి కతంబని తత్సఖీతతిన్
సాదర మొప్పఁబల్కఁగ, నసాధ్యత దోఁపగ దీనిఁ [1][దీర్పఁ]గా?
రాదన, నక్రవల్లభుఁడు ప్రాణములైనఁ దృణమ్ములట్ల నిః
ఖేదముతోడ నిత్తు సతికిం దగదేహగుణమ్ము చేసినన్.

16


వ.

అని వివర్ణవదనుండై పలవించుచుండ, నంత పతిమనఃప్రియం
బెఱింగి పరిచారికాజనం బిట్లనియె, ఎందేనియు నొక్కబాహాటశాస్త్రపారంగ
తుండగు చికిత్సకుం డేతెంచి భవత్కళత్రంబు కరంబు పట్టి చూచి నిదా
నించి యిట్లనియె,—

17


క.

ఈనీచరోగ మరయ, న
హీనవిషము మాడ్కి నెక్కు, నెచ్చటనయినన్
వానరహృదయము దొరకిన
మానుననుచుఁ జెప్పిచనియె మకరాధిపతీ!


వ.

అని చెప్పిన సఖీజనమ్ముపలుకులు విని యతఁడు తనహృద
యంబున..............గా దలంచె, —

18


క.

అపగత సుకృతులు నొకనికి
నెపమిడి యందఱును గూడి నెఱిఁబన్నిన పా
పపుదలఁపు ఘనులకైనను,
కపటంబని తెలియరాదు కరణిక లక్ష్మా!

19


ఉ.

భానుఁడు శీతభానుఁడన, పట్టపగల్ నడురేయటన్న, సు
జ్ఞానుల చంచలాత్ములన, సత్యము గల్లయటన్న, నట్లయై
కానబడున్ మనోజశర[గాహితచిత్తులకున్] దలంప భా
మానికరమ్ముచేత, గుణమండన! విఠ్ఠయలక్ష్మధీమణీ!

20


ఇంద్రవజ్రము.

ఆనక్రముఖ్యుం డపు డాత్మలోనన్
దానెంచి చింతింపుచు ధర్మమెల్లన్

  1. "కూతగా" అని మూలము