పుట:పంచతంత్రి (భానుకవి).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డగుచు నర్జునుఁడుబృహన్నల.........
                    ...................డై నకులుఁ డశ్వ
శిక్ష సేయుచును వసింపఁడె సహదేవుఁ
                    డావుల గాయుచు నజ్ఞుభంగి
నుండఁడే, ద్రౌపది యొప్పుగ సైరంధ్రి
                    యన ............నుండదే యనుసరించి


గీ.

యావిరాటునినగరమ్మునందు [మున్ను]
..................................................
నట్లు గావింప సంపద లతనిఁ బొందు
లలితగుణధుర్య! విఠ్ఠయ లక్ష్మణార్య!

118


వ.

కావున నేను పాండవేయులవిధంబునం బరులచేత మోసంబు
........................................... రక్తాక్షుండను ఘూకప్రభుమంత్రి నీతి
విశాలుండు బుద్ధిమంతుండు గావున రాజునకు మీఁదవచ్చు కార్యంబు
తెఱం గెఱిఁగించె నతనిచే నీమర ..........యువన్య..........................
బడితినని యతండు వెండియు నిట్లనియె.

119


క.

యానాసనసుఖనిద్రా
పానాన్నంబులను వలయుఁ బ్రభునకు మిగులన్
మానైనరక్ష, తేజో
భానుప్రతిమాన! నూత్న భరతాచార్యా!

120


గీ.

..........రంబుల ...............................
నపుడు వైశ్వానరుఁడు వాని నణఁచుభంగి
యరుల మధ్యస్థుఁడై పాయునపుడు గూల్ప
వలయు ధారుణి నీతిమంతులకు నరయ.

121


వ.

అని చెప్పి ము న్నొక[పన్నగవిభునిచేత] నొక్కమండూకవిభుండు మృతింబొందఁడె
యనిన, నది యెట్లని మేఘవర్ణుం డడిగిన చిరంజీవి యిట్లనియె.

122


సీ.

విను మొక్కపన్నగవిభుఁడు మందవిషాభి
                    ధానుండు భేకసంతాన ముండు