పుట:పంచతంత్రి (భానుకవి).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


.................యప్పుడు జీవహింస
                    యని [ముని]మాడ్కి నుండినను ప్రీతి
నొకకప్ప చేరి యిట్లో ఫణిరాజ! ని
                    రాహారవృత్తి నీహ్రదములోన
నేటికి నున్నాఁడ వెఱిఁగింపుమనఁ బాము
                    నిట్లనె ము న్నొక్కయిద్ధగుణుఁడు


గీ.

బ్రాహ్మణా....................................
పోవుచును నన్ను ద్రొక్కినఁ బోక నేను
కఱచి వానినిఁ ]జంపితి]ఁ గరుణ లేక
వానితండ్రియు నది విని వచ్చె వేగ.

123

వ.

వచ్చి నన్నుఁ జూచి నాచిఱుతకొమరుని నీవు మృతిఁబొందింపఁ
దగునె .................................యింత తప్పుఁ జేసితివి నాసామర్ధ్యంబున
నిన్ను భస్మీభూతమ్ము సేయంజాలుదు నైనను హింస సిద్ధించునని వెఱచి
యున్న వాఁడ. నేఁటినుండియు నీకాహరంబు .........................యపుడ
నీకు మృత్యువు సిద్ధించునని నాకు శాపం బిచ్చి యాపాఱుండు యధేచ్ఛ
నరిగె, నంత నేను నిమ్మడువునకు వచ్చి నిరాహారుండనై యుగ్రతపమ్ము
సేయుచున్నవాఁడ, మఱియును,—

124


క.

....................... ప్పరి
యీవారిధి నున్నవాఁడ యింద............
నావలనను బ్రోవుండనం
దా వేగం బరిగె కప్ప తనపతికడకున్.

125


వ.

అ ట్లతిత్వరితగతిం జని తమయేలికయగు జాలపాదుండను మండూకపతి
[కి భుజగ]పతివృత్తాంతం బంతయుఁ జెప్పిన నతం డాశ్చర్యమ్ము నొంది తనపరిజన
మ్మును దానును దందశూకం బున్నయెడకు వచ్చి యతనిం గాంచి యిట్లనియె.

126


మ.

జలపాదుండను భేకవల్లభుఁడ, నుత్సాహమ్ముతో వచ్చితిన్
ౙల మొప్పంగను నీదునిష్ఠకును నిచ్చన్ మెచ్చితి న్నంచు కుం
డలి నారోహణ మాచరింప, నది యాడంజొచ్చె, సంప్రీతి నా