Jump to content

పుట:పంచతంత్రి (భానుకవి).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అవ్విధమ్మునఁ గడిపోతు నట్లు గొంత
కాల మందుండి నిజపతి కార్యఘటన
కనువు గోరుచునుండి యన్యాభిలాష
లాత్మ దలఁపక, యొక్కనాఁ డతఁడు దలఁచె.

113


చ.

అనువగునప్పు డేచి యభియాతులఁ గూల్చుట నీతిమార్గ మె
వ్వనికిని, ఘూకసంతతి దినంబున నిద్దురనొందె, నీగుహన్
ఘనతరవహ్నిచే నిపుడు గాల్పఁగవచ్చు నటంచు మేఘవ
ర్ణునికడ కేగ, నాతఁడు దనుం బ్రియమారఁగఁ జేసి కౌఁగిఁటన్.

114


వ.

అప్పు డతికుతూహలమ్మున నతనితో సంభాషించి చిరంజీవీ!
నీవుపోయినకార్యం బేమయ్యె! నచటివృత్తాంతం బెఱింగింపుమనిన నతం
డిట్లనియె. నాపోయినకార్యమ్ము నీకుఁ జెప్పెద. తడవు సేయ నిది సమ
యంబు గాదు తర్వాత నెఱింగించెద, నరి సమయుటకు నెడరుగని వచ్చిన
వాఁడఁ దామసింపం జెల్లదు. మీరందఱు గూడుకొని బహుకాష్ఠసంచ
యంబులు గైకొని జవంబునం జనుదెంచుట కర్తవ్యం, బేనును ననలమ్ము
గొని చనుదెంచెద నని సకలకాకంబులఁ జేకూర్చుకొని యింధనాగ్నులు సంగ్ర
హించి ఘూకమ్ములమూఁకయున్న గుహాముఖంబు డాయంజని వేగం
బకదిసి,—

115


క.

పెట్టిరి కాష్ఠమ్ముల, పైఁ
బెట్టిరి యనలమ్ము, నపుడు భీకరకీలల్
దట్టంబై తముఁ జుట్టినఁ
బట్టగలు గూబలెల్ల భస్మంబయ్యెన్.

116


ఆ.

అపుడు మేఘవర్ణుఁ డతిమోదమునఁ జిరం
జీవి సూచి, యెట్లు సెపుమ! శత్రు
సంచయమ్మునడుమ సౌహృద మొప్పారఁ
బరగనుంటివనినఁ బలికె నతఁడు.

117


సీ.

కంకుడై [యుండఁడే] కార్యార్ధియై ధర్మ
                    జుఁడు భీము డుండఁడె సూపకారుఁ