పుట:పంచతంత్రి (భానుకవి).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇది యేటి సుఖము, నాథునిఁ
గదిసిన సుఖమునకు సాటిగలదే! యనినన్
మదిలోనఁ దత్ప్రియుండును
ముద మొదవ వధూటివాక్యముల కవ్వేళన్.

104


వ.

పర్యంకమ్ము క్రిందనుండి వెడలివచ్చి కంకటిపై భుజంగసమే
తమై యున్న యయ్యంగనం దోడుకొని రాజమార్గంబునఁ బతివ్రతాభరణం
బిదియని కొనియాడం దొడంగె. ఆట్లు గాకుండ బ్రత్యక్షదోషం బెఱుంగ
వలయుననిన, రోషారుణీకృతాక్షుండై ఘూకవల్లభుం డతనివాక్యంబు ల
నాదరంబు చేసి, చిరంజీవినిఁ జేపట్టి కోటరంబునకుం దోడ్కొని చని సుఖం
బున్న సమయమ్మున, నక్కాకం బవ్విభున కిట్లనియె.

105


సీ.

పావకార్చులనైనఁ బడి దేవరకు హితం
                    బాచరించెదను దథ్యంబటన్నఁ
గెరలి రక్తాక్షుండు మరణహేతువు సెప్పు
                    మనినఁ జిరంజీవి యపుడు సెప్పెఁ
గౌశికత్వము నొంది కాకకులమ్ము సం
                    హారమ్ము సేయుదుననిన, నవ్వి
తనజాతికాక తక్కినజాతిః బొందంగ
                    [వలచి] భాస్కరమేఘవాయుభూధ


గీ.

రములచేఁ బాసి [మూషిక తమ]కులంబు
విభుని వరియింప[దే! యన]న విని యతండు
తనునదెట్లని యడిగిన, మును మహాత్ముఁ
డైన ముని, జాహ్నవీతీరమందు నిలిచి.

106


వ.

తపమ్ము సేయుచుండ నొకనాఁడు గగనమార్గమ్మునుండి శ్యేన
ముఖమ్మువలన, విడివడి తనకరమ్మునందు మూషికశిశువు పడిన నతండు,—

107


గీ.

తనతపశ్శక్తి పెంపార, దాని నొక్క
కన్యకామణిగాఁ జేసి కౌతుకమున