పుట:పంచతంత్రి (భానుకవి).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పలుకులఁ బ్రీతి సంపదఁ దేలుదురు రథ
                    కారుఁడు [రమణిని] జారుతోడఁ
దల మోచికొనుచు నృత్యం బాచరింపఁడె
                    యన విభుఁ డెఱిగింపుమనినఁ దొల్లి
కలఁ డొకపురి రథకారుఁ డతండు దు
                    శ్చరిత యౌ తనభార్య జాడ తెలిసి


గీ

రాజు కూటమి గలిగుండ, రాజుతోడఁ
గర్జమున్నది వే నరుగంగవలయు
ననినఁ ద్రోవకు సంబళం బప్పు డొసఁగి
యనిపి తనమది సంతసం బందియుండ,
నెలమి రథకారుఁ డెవ్వరు నెఱుఁగకుండ.

93


వ.

తనభార్యకుం జెప్పె బంధుదర్శనార్ధం బొకపురంబున కేగవలయు,
రాజుచేత నామంత్రితుండనైతి, నేనుం బోయివచ్చెద నని వీడ్కొని కొంత
ద వ్వరిగి యెవ్వరు నెఱుంగకుండం, గ్రమ్మఱ విభావరీసమయమ్మున నిజ
గృహమ్మున కేతెంచి తనభార్య యెఱుంగకుండఁ బర్యంకమ్ముక్రింద నణంగి
యున్న సమయమ్మున,—

94


గీ.

శంక యొక్కింత లేక యా[ఱంకుటా]లు
దూతికాముఖవార్తచేఁ బ్రీతినంది
చేరవచ్చిన జారుని గారవించె
తేజరిల్లు కటాక్షనీరాజనమున.

95


క.

ఆకులట జలకమాడఁగ
నేకాంతస్థలముగూర్చి యేగిన, మదనో
ద్రేకమున జారపురుషుఁడు
చీకాకునఁ బొరలె కొంతసేపటిలోనన్.

96


గీ.

ఎప్పుడేనియు దిఙ్మదేభేంద్రకుంభ
సన్నిభములైన పాలిండ్లు జారకాంత
నాయురస్స్థలిఁజేర్చు మన్నన దలిర్ప,
నపుడు మదనాగ్ని యణఁగు నటంచు నుండ.

97