పుట:పంచతంత్రి (భానుకవి).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఆబ్రహ్మరాక్షసుం డవనీసురోత్తము
                    మును గ్రహింపఁగ లేచెననుచుఁ, జోరుఁ
డావుల రెంటిని నవహరించెదఁ దొల్త
                    ననిన, నట్లగునే! తద్ధ్వనుల నతఁడు
నిద్రఁ దేఱునటన్న, నీవు పట్టిన మేలు
                    కొని ప్రేల నాకును గోయుగంబు
దొరక నేర్చునె యని యిరువురు వాదింప
                    నాతఁడు లేచి యిట్లనియె, మీర
లెవ్వరన బ్రహ్మరాక్షసుం డితఁడు నిన్ను
బట్ట వచ్చె నటంచుఁ జెప్పంగబడిన
యతఁడు, పల్కెను నీయావు లపహరింపఁ
జేరియున్నాఁ డెఱుంగుము చోరుఁ డితఁడు.

88


వ.

అని యి ట్లొండురువు లతనితో భాషింపంబడి హితం బొనర్చిరి
గావున, నితండును వధార్హుండు గాఁడని వెండియు నిట్లనియె.—

89


చ.

శరణని యొక్కపక్షి మును సాధ్వసకంపితసర్వగాత్రమై
మఱుఁగు జొరం గడంక నిజమాంస మొడంగెను నింగి నొక్కటన్
సురలు నుతింపగా, శిబి, వసుంధర నార్తులఁ బ్రోచు వారలన్
జిరతరకీర్తి పొందు నిది సిద్ధము విఠ్ఠయ లక్ష్మధీమణీ!

90


వ.

అని పలుక విని ఘూకప్రభుండు ప్రాకారకర్ణుం డనువాని నడి
గిన, నతం డీబలిభుక్కు వధార్హుండు గాఁడని చెప్పిన విని లేచి యధికరోష
మ్మునఁ గటమ్ము లడక వెండియు రక్తాక్షుం డిట్లనియె,—

91


ఉ.

దేవ! యెఱుంగ రిద్దఱును ధీయుతచిత్తులుగారు, వీఁడు దు
ర్భావుఁడు పింగళాక్షుఁడు సభ న్వినుపింపడె నీకు నీఖలున్
జీవముతోఁడ నిల్పిన నశేషదివాంధకులమ్ము ద్రుంగెడున్
నావచనమ్ము సత్యమని నమ్ముము, నీకు హితమ్ముఁ జెప్పితిన్.

92


సీ.

ప్రత్యక్షదోషమ్ము భావింప రాత్మ సు
                    బుద్ధులు సాంత్వనపూర్వమైన