పుట:పంచతంత్రి (భానుకవి).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దననిలయమ్మునకుం జనియె, నట్లు గావున నితనికి హిత వాచరించుట కర్తవ్యం
బను నవసరమ్మునఁ బింగళాక్షుండనువాఁ డదరిపడి డాసి యారాజుతో
నిట్లనియె,—

83


క.

పగతునిఁ [గైకొన]ఁబోలునె
తెగటార్పక యున్న, వాఁడె తెగటార్చుఁ జుమీ
...గి ...యైన ....వు
...గి ....కాల ....నట్లుగాదె ధృతి పగవాఁడున్.

84


సీ.

దేవ నాపల్కు సందేహమ్ము లే, దభి
                    యాతి యైనను మాటలాడినపుడు
పరమహితుండగు బ్రహ్మరాక్షసుచేత
                    ధేనుద్వయము, కన్నగానిచేత
నాయువు, నీఁబడె నవనీసురుని కన్న,
                    నాకథ యెఱిఁగింపు మనినఁ, దొల్లి
కలఁడు విప్రుఁడు ప్రతి[కల్యంబు నతఁడు] గో
                    యుగమును మేపుచు నుండుగాన
నట్టియావుల నొకచోరుఁ డపహరింపఁ
దలఁచి నిశివేళఁ బోవ నాతనిశరీర
మన్యగాత్రమ్ము సోఁకిన నరుదు నొంది
యెవ్వఁడవు సెప్పుమన్న వాఁ డిట్లు పలికె.

85


గీ.

సాహసుండను బ్రహ్మరాక్షసుఁడ నీవు
నెవ్వఁడవు నాకు నెఱిఁగింపు మిప్పు డనిన
నేను జోరుండ నన, నతం డేమి గోరి
యేఁగుచున్నాఁడ వని తన్ను నెలమి నడుగ.

86


వ.

ఏఁ దస్కరుండ సమీపగ్రామనివాసియగు విప్రుని గోయుగం
బపహరింప నేఁగుచున్నవాఁడ ననిన, నారాక్షసుండును మద్గమనం బతనినిఁ
బట్టుటకని చెప్పి యాయిరువురును నాభూసురుమందిరమ్ము ప్రవేశించి
రయ్యవసరమ్మున,—

87